[t4b-ticker]

ప్రజయ్ వాటర్ ఫ్రంట్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికే చెట్ల తొలగింపు

కాలనీవాసుల అనుమతులతోనే వృక్షాల తొలగింపు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు

ప్రతిపక్షం,శామీర్‌పేట, సెప్టెంబర్14: శామీర్‌పేట మండలం తుర్కపల్లి పరిధిలోని ప్రజయ్ వాటర్‌ఫ్రంట్ ఫేస్ వన్ లో డ్రైనేజీ సమస్య పరిష్కారంలో భాగంగానే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నాలాలకు అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించినట్లు కాలనీవాసులు తెలిపారు.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్లను కాలనీవాసుల అనుమతితోనే తొలగించామని, ఎవరూ వ్యక్తిగతంగా చెట్లను తొలగించలేదని వారు స్పష్టం చేశారు. కౌన్సిలర్ మహమ్మద్ యూసఫ్ బాబా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెట్లను నరికించారంటూ కొందరు గిట్టని వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాలనీవాసులు పేర్కొన్నారు.కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్ యూసఫ్ బాబా ఎప్పటికప్పుడు తమకు అండగా ఉంటున్నారని వారు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
డ్రైనేజీ నాలాలకు అడ్డుగా ఉన్న వృక్షాలను తమ అనుమతులతోనే తొలగించామని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని కాలనీవాసులు స్పష్టం చేశారు. ప్రజయ్ వాటర్‌ఫ్రంట్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.

Spread the love

Related News

Latest News