ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు

ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటినీ ఒకే వేదికపై అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసేలా ఏఐ సాంకేతికతను...
ఆదాయ పెంపే లక్ష్యం.. లీకేజీలకు చెక్, ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్

ఆదాయ పెంపే లక్ష్యం.. లీకేజీలకు చెక్, ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆదాయ సమీకరణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్...
రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 01: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రూ.2,482.02 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను దశలవారీగా రైతులకు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు...
యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం

యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం

ప్రతిపక్షం, జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలకు భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి అదే తరహాలో భూముల కేటాయింపు విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని సూచించారు. గుట్టపై అతిథి గృహాల నిర్మాణానికి ఆసక్తి చూపే వారి జాబితా రూపొందించి,...
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 29: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మూసీ నది ప్రక్షాళన పనులను పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్‌లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన తన కల అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే తెలంగాణ పట్టణ ఆర్థిక,...
ePaper
వ్యాపారం
Spread the love