ఎల్‌నినో, వర్షాభావంపై కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణి అక్రమాలపై సిట్

ఎల్‌నినో, వర్షాభావంపై కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణి అక్రమాలపై సిట్

ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ కేబినెట్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనుంది. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఎల్‌నినో...
క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం.. విజేతలకు నగదు బహుమతులు, ఉద్యోగాలు: సీఎం రేవంత్

క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం.. విజేతలకు నగదు బహుమతులు, ఉద్యోగాలు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపే వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇటీవల విజయవంతంగా ముగిసిన తొలి సీజన్ టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జట్టు సభ్యులను అభినందించారు. విజేతలకు నగదు బహుమతులకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు.. ఆగస్టు 15లోపు 27.5 లక్షల మందికి ఎడ్యుకేషన్ కిట్లు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు.. ఆగస్టు 15లోపు 27.5 లక్షల మందికి ఎడ్యుకేషన్ కిట్లు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 16: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. "పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాతను మార్చాలి" అంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, విద్య ద్వారానే ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థినులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి తొమ్మిది రకాల వస్తువులతో కూడిన తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు అందజేస్తామని ప్రకటించారు. రూ.1,000 కోట్లకు...
పాలమూరు–రంగారెడ్డికి త్వరలో శుభవార్త.. 90 టీఎంసీల నీటి అనుమతుల కోసం కసరత్తు: సీఎం రేవంత్

పాలమూరు–రంగారెడ్డికి త్వరలో శుభవార్త.. 90 టీఎంసీల నీటి అనుమతుల కోసం కసరత్తు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 15: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపుల అంశంపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు...
2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అమెజాన్ డేటా సెంటర్‌తో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం: సీఎం రేవంత్

2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అమెజాన్ డేటా సెంటర్‌తో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణను అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2034 నాటికి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తొలి మెట్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు...
ePaper
వ్యాపారం
Spread the love