3కార్పొరేషన్లుగా హైదరాబాద్​.. గెజిట్​ విడుదల

3కార్పొరేషన్లుగా హైదరాబాద్​.. గెజిట్​ విడుదల

ప్రతిపక్షం, హైదరాబాద్​, ఫిబ్రవరి 11:గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎంఎంసీ), సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (సీఎంసీ)లను ఏర్పాటు చేస్తూ గెజిట్​ విడుదల చేసింది. అలాగే ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్​ఎంసీ కమిషనర్​ గా ఆర్ వీ కర్ణన్​ ను యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం సైబరాబాద్​ కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్​ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. జీహెచ్​ ఎంసీ లోని 150 డివిజన్లు డి లిమిటేషన్​ లో భాగంగా 243 డివిజన్లుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు 57 డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం,...
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

ప్రతిపక్షం, హైదరాబాద్​, ఫిబ్రవరి 11:రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ అధికారులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం వెలువడిన ఉత్తర్వులలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్​ ను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అదనపు బాధ్యతల్లో ఉన్న కృష్ణభాస్కర్​ ను ప్రభుత్వం తప్పించింది. సీనియర్​ ఐఏఎస్​ అధికారి సబ్యసాచి ఘోష్​ ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్​ సీఎస్​ గా, కమిషనర్​ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. ప్రజావాణి రాష్ట్ర నోడల్​ అధికారిగా కాత్యాయినీ దేవిని బదిలీ చేస్తూ స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ గా...
అబద్దాలకు అంబాసిడర్ కేటీఆర్

అబద్దాలకు అంబాసిడర్ కేటీఆర్

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణత్వరలో ‘కవ్వంపల్లి ’కి ప్రభుత్వ విప్90శాతం కాంగ్రెస్ సర్పంచ్ లు విజయంఏకగ్రీవం పంచాయతీ 'లకు రూ. 20 లక్షలు ప్రతిపక్షం, కరీంనగర్​ ప్రతినిధి :మానకొండూర్ నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, 90 శాతం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ సర్పంచ్ లు విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరువాత తెలంగాణ ప్రభుత్వం లో ఎమ్మెల్యే కవ్వంపల్లి'కి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం 'ప్రభుత్వ విప్ పదవి ' లాంటి కీలక భాద్యత'లు అప్పగించే పనిలో ఉన్నట్లు వస్తున్న ప్రచారం నేపథ్యంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో ప్రతిపక్షం ప్రతినిధి కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు....
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ

దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ

ప్రతిపక్షం, స్టేట్​ బ్యూరో, నవంబర్​ 20: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషికి వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం రేవంత్​ అన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని కేంద్ర మంత్రికి ఆయన సూచించారు. అవసరమైతే దీనిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తరువాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు....
వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు

వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు

గందరగోళంలో ఆలయ ఉద్యోగులు 17 మంది ఉద్యోగులను బదిలీ చేసిన ఈఓ ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ నవంబర్ 20: ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపర్డెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, ఒకరు రికార్డ్ అసిస్టెంట్, మరొకరు అటెండర్ ఏవో రమాదేవి అంతర్గత బదిలీ చేశారు.బదిలీ అయిన ఉద్యోగులు వారి వారి స్థానాల్లో చార్జీలు తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న ఆలయ ఈవో రమాదేవి హెచ్చరించారు. సెంట్రల్ గోదాం సూపర్డెంట్ గా పనిచేసిన వెంకట ప్రసాద్ రాజు ను బదిలీ చేసి అదే ప్లేస్ లో సూపర్డెంట్ సంతోష్ కు ఇచ్చారు. మూడు రోజుల్లో సెంట్రల్ గోదాం లో ఉన్న సరుకులను వెచ్చించి సంతోష్ కు చార్జ్ ఇవ్వాలని వెంకటప్రసాద్...
ePaper
Spread the love