కాళేశ్వరం పునరుద్ధరణకు ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలే ప్రామాణికం.. నిపుణుల సూచనలతోనే ముందుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం పునరుద్ధరణకు ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలే ప్రామాణికం.. నిపుణుల సూచనలతోనే ముందుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 12: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణను పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచనలు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సిఫారసుల మేరకే చేపడతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ప్రస్తుతం నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నందువల్లే ప్రభుత్వం నీటిని ఎత్తిపోసే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్ఏ తుది నివేదిక వెల్లడించిందన్నారు. మేడిగడ్డలోని ఏడో బ్లాక్ పిల్లర్లు కుంగిపోవడం వల్ల మొత్తం బ్యారేజీ...
‘ముళ్ల’ బంధం

‘ముళ్ల’ బంధం

నెత్తురొడుతున్న వివాహ బంధం వరుస హత్యలతో కలకలం అక్రమ సంబంధాల మోజులో హత్యలు చెరసాల పాలవుతున్న ప్రేయసీ, ప్రియులు విడిపోయే అవకాశాలున్నా అంతమొందించడమే లక్ష్యం కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నం వైవాహిక బంధాలపై ఆందోళన ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే కారణమా? (రాందేని చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు) ప్రతిపక్షం, జూలై 11: ‘నూరేళ్ళ జీవితం.. అగ్నిసాక్షిగా వేసిన ఏడడుగులు.. సుఖఃదుఃఖాల్లో తోడుంటాననే ప్రమాణం..’ వివాహ బంధం గురించి మనం చెప్పుకునే గొప్ప మాటలివి. నేడు కొన్నిచోట్ల ఈ పవిత్ర బంధం నెత్తురోడుతోంది. క్షణికావేశం, అక్రమ సంబంధాలు, ఆస్తి వ్యామోహం.. కారణం ఏదైనా కావచ్చు, ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తలను భార్యలే కడతేరుస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కట్టుకున్నవాడే అని కూడా చూడకుండా...
రైతు కళ్లలో ఆనందమే మా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్

రైతు కళ్లలో ఆనందమే మా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే తమ ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన భారీ రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా రైతు భరోసా నిధుల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం.. మొత్తం 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు సీఎం వెల్లడించారు. సభా వేదిక నుంచే రైతు భరోసా చివరి విడత కింద 1.44 లక్షల...
2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలి: సీఎం రేవంత్

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 10: 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం దక్కేలా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ క్రీడలకు తెలంగాణ వేదిక కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు. గచ్చీబౌలి స్టేడియంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం, క్రీడా రంగంలో తెలంగాణ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 82 ఎకరాల్లో ప్రపంచ స్థాయి వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడల్లో దేశం వెనుకబడటానికి స్పష్టమైన విధానం లేకపోవడమే కారణమని పేర్కొంటూ, తెలంగాణలో సమగ్ర క్రీడా విధానాన్ని అమలు...
కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం.. సోలార్ తయారీ యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్

కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం.. సోలార్ తయారీ యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 09: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని మొత్తం కోర్ అర్బన్ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోలార్ ఆక్సీ ట్రీ, సోలార్ ఆధారిత వీధి దీపాలు, గాలి శుద్ధి వ్యవస్థతో పాటు సంస్థ తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి...
ePaper
Spread the love