సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

ప్రతిపక్షం, జూన్ 05: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న పలు ఎత్తిపోతల, సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. జిల్లా అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు అత్యంత కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగా పనులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని సీఎం సూచించారు. భూసేకరణ...
మక్తల్ ఎత్తిపోతల పనులపై సీఎం రేవంత్ సమీక్ష.. వేగవంతం చేయాలని ఆదేశం

మక్తల్ ఎత్తిపోతల పనులపై సీఎం రేవంత్ సమీక్ష.. వేగవంతం చేయాలని ఆదేశం

ప్రతిపక్షం, జూన్ 04: తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సీఎం పేర్కొన్నారు. బెంగళూరులో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శన, సాంకేతిక ప్రణాళిక మ్యాపులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, పనుల పురోగతి, వ్యయ అంచనాలు, నీటి వినియోగ సామర్థ్యం తదితర అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎక్కడ...
జర్మనీతో తెలంగాణ కీలక ఒప్పందం.. నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులకు కొత్త దారులు

జర్మనీతో తెలంగాణ కీలక ఒప్పందం.. నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులకు కొత్త దారులు

ప్రతిపక్షం, జూన్ 04: శాస్త్ర సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలోని థూరింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో థూరింగియా రాష్ట్ర మంత్రి-అధ్యక్షుడు మారియో ఫోగ్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమై పెట్టుబడులు, విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించింది. తెలంగాణ అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని మారియో ఫోగ్ట్ ప్రశంసించారు. కృత్రిమ మేధస్సు యుగంలో మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేలా విద్యా, శిక్షణ...
తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 02, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రాన్ని ప్రపంచానికి గేట్‌వేగా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రజలంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, రెండున్నరేళ్లలో వ్యవసాయం, రైతు...
ధాన్యం కొనుగోలుపై రైతులకు భరోసా.. ప్రతి గింజా కొంటాం: సీఎం

ధాన్యం కొనుగోలుపై రైతులకు భరోసా.. ప్రతి గింజా కొంటాం: సీఎం

ప్రతిపక్షం, జూన్ 02: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాలకు తడిసిన ధాన్యానికీ కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభలో మాట్లాడిన సీఎం, ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. మద్దతు ధర ప్రకటించడమే కాకుండా పండించిన పంటను కొనుగోలు చేయడం కూడా కేంద్ర బాధ్యతేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మొత్తం 75 లక్షల మెట్రిక్...
ePaper
Spread the love