[t4b-ticker]
గవర్నర్ ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి.. పాల్గొన్న ప్రముఖులు

గవర్నర్ ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి.. పాల్గొన్న ప్రముఖులు

ప్రతిపక్షం, ఆగస్టు 16, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో లోక్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌ హోమ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. దీంతో లోక్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు...
ఉద్యోగార్థులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ఇకపై ఆరు నెలలకోసారి పోటీ పరీక్షలు

ఉద్యోగార్థులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ఇకపై ఆరు నెలలకోసారి పోటీ పరీక్షలు

ప్రతిపక్షం, ఆగస్టు 15, సంగారెడ్డి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సీఎం సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వం అమలు...
తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 15: తెలంగాణ పునర్నిర్మాణానికి గత రెండున్నరేళ్ల ప్రజా పాలనలో బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు, ఉద్యోగులు, అధికారులు అందించిన సహకారం కీలకమని పేర్కొంటూ.. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం గడిచిన 32 నెలల్లో సంక్షేమంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసిందని సీఎం తెలిపారు. సామాజిక న్యాయం, వ్యవసాయం,...
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 15: తెలంగాణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు...
ఎర్రకోటపై నుంచి మోదీ కీలక ప్రసంగం.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం

ఎర్రకోటపై నుంచి మోదీ కీలక ప్రసంగం.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం

ప్రతిపక్షం, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులు, విప్లవకారులు, మహాత్మా గాంధీతో పాటు అనేక మంది మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన సంకల్పమని ప్రధాని స్పష్టం చేశారు. ఎర్రకోటపై నుంచి ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు. స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎర్రకోట ప్రాకారాల నుంచి వినిపించడం ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం...
Spread the love