[t4b-ticker]
హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి.. నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి.. నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పరిశీలించారు. జిల్లాల పర్యటనలో భాగంగా హకీంపేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎడ్యుకేషన్‌ హబ్‌లో నిర్మిస్తున్న వివిధ విద్యా, వైద్య సంస్థల భవన సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒక్కో నిర్మాణాన్ని స్వయంగా పరిశీలిస్తూ పనుల పురోగతి, నాణ్యత, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల, వెటర్నరీ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ, పారామెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు 400 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. వీటితో పాటు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాలు, విద్యార్థుల కోసం...
రాంకీ కోసం స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొడతారా?.. సీఎం రేవంత్‌పై కవిత తీవ్ర ఆగ్రహం

రాంకీ కోసం స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొడతారా?.. సీఎం రేవంత్‌పై కవిత తీవ్ర ఆగ్రహం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04, హైదరాబాద్‌: స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధికి నష్టం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆటో కార్మికులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కవిత.. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించే ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం రాంకీ సంస్థకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, చెత్త సేకరణకు సంబంధించిన రుసుమును ఆస్తి పన్నులోనే కలిపి వసూలు చేయాలని చూస్తోందని కార్మికులు కవిత దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తూ స్వయం...
కేసీఆర్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌.. సెప్టెంబర్‌ 6న మహా ధర్నా

కేసీఆర్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌.. సెప్టెంబర్‌ 6న మహా ధర్నా

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ నెల 6వ తేదీన ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి తమ డిమాండ్‌ను బలంగా వినిపించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు వెయ్యి రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించకపోవడం వంటి...
భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. మద్దూరులో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు

భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.. మద్దూరులో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న సీఎం.. పాఠశాల నిర్మాణ ప్రణాళికలు, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సుమారు పదేళ్ల క్రితం సొంత డబ్బుతో భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించడంతో ప్రస్తుతం అదే స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో భూమి అందుబాటులోకి వచ్చిన విధానం, ప్రస్తుతం కొనసాగుతున్న...
సీఎం కావాలన్నది నా ఆకాంక్ష.. ఆ పదవికి గౌరవం, హుందాతనం ముఖ్యం: కవిత

సీఎం కావాలన్నది నా ఆకాంక్ష.. ఆ పదవికి గౌరవం, హుందాతనం ముఖ్యం: కవిత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత బహిరంగంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం అధికారాన్ని అనుభవించే హోదా కాదని, ఆ పదవికి గౌరవం, హుందాతనం ఎంతో ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఉన్న లక్ష్యాలపై స్పష్టతతో ఉన్నానని చెబుతూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై కూడా కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనా తీరుపై గతంలో తాను చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై కొన్ని చర్యలను ప్రత్యేకంగా విమర్శించాల్సిన...
Spread the love