[t4b-ticker]
హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్: హిందూ, ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, రెండు వర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో సీఎం పాల్గొన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన 782 మంది మైనారిటీ అభ్యర్థులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు....
22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక భరోసా

22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక భరోసా

ప్రతిపక్షం, ఆగస్టు 13: హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులకు కీలక భరోసా ఇచ్చారు. ఏదైనా కారణంతో తమ భూములు నిషేధిత జాబితా 22ఏలో చేరాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హక్కుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్థానిక భూముల సమస్యను ప్రస్తావించిన సీఎం.. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి మిగిలిన భూములకు సర్వే నంబర్ల...
మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్‌: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయి ప్రభుత్వానికి తిరిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సహకరించే వారితో సానుకూలంగా వ్యవహరిస్తామని, ఉద్దేశపూర్వకంగా బకాయిలను ఎగవేసేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూలు, ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, రానున్న...
గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 13: గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకుని రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించాలని సూచించారు. నీటి పారుదల శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ఎత్తిపోతల పరిస్థితి, పెండింగ్ పనులు, భూసేకరణ, ముంపు గ్రామాలకు పరిహారం, పునరావాసం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. గోదావరి నుంచి లభిస్తున్న నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం...
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

ప్రతిపక్షం, ఆగస్టు 11, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై సమగ్రంగా దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ప్రదర్శించేలా సమ్మిట్‌ నిర్వహణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమలకు ప్రభుత్వం...
Spread the love