[t4b-ticker]
తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచానికి చాటిచెప్పండి.. లండన్‌ వేదికగా సీఎం రేవంత్ పిలుపు

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచానికి చాటిచెప్పండి.. లండన్‌ వేదికగా సీఎం రేవంత్ పిలుపు

ప్రతిపక్షం, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, ఉపాధి అవకాశాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్‌’ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి లండన్‌లోని తెలుగు ప్రవాసులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని, రాష్ట్రానికి సంబంధించిన అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆదివారం లండన్‌లో తెలుగు ప్రవాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాసులతో ముఖ్యమంత్రి విస్తృతంగా ముచ్చటించారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, సాంకేతిక రంగంలో...
తెలంగాణ రక్షణ సేన వివిధ దేశాల అధ్యక్షుల నియామకం

తెలంగాణ రక్షణ సేన వివిధ దేశాల అధ్యక్షుల నియామకం

14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రతిపక్షం, ఆగస్టు 23, హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బలోపేతం కోసం 14 దేశాల్లో పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈమేరకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 దేశాలతో పాటు పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించారు. ఆయా దేశాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వారి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. వివిధ దేశాలకు నియమించిన అధ్యక్షుల వివరాలు ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి యూకే: సుమన్ రావు బాల్మూరి కెనడా: వెంకట్రామణ్ మెట్ పల్లి ఇటలీ: తానింకి కిషోర్ యాదవ్ మాల్టా: పింటూ ఘోష్ పోర్చుగల్: ప్రకాష్...
అంబేద్కర్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ‘ఇది జీవితంలో గొప్ప క్షణం’ అంటూ భావోద్వేగం

అంబేద్కర్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ‘ఇది జీవితంలో గొప్ప క్షణం’ అంటూ భావోద్వేగం

ప్రతిపక్షం, ఆగస్టు 23: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లండన్‌లోని చారిత్రక అంబేద్కర్ హౌస్‌ను సందర్శించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో ముడిపడిన జ్ఞాపకాలను, ఆయన వ్యక్తిగత వస్తువులను పరిశీలించారు. అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం తనకు జీవితకాల స్ఫూర్తిని అందించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22లో లండన్‌లో ఉన్న సమయంలో ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించారు. ప్రస్తుతం ఆ చారిత్రక భవనాన్ని అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆలోచనలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని ప్రతిబింబించే మ్యూజియంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి రేవంత్...
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యా దిగ్గజం.. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ప్రకటన

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యా దిగ్గజం.. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ప్రకటన

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాలపై ఆ విద్యాసంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృతంగా చర్చించారు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ సెనేట్ హౌస్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులకు వివరించింది. తెలంగాణలో ఉన్న...
కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యం.. విద్య, పరిశోధన రంగాల్లో కీలక ముందడుగు

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యం.. విద్య, పరిశోధన రంగాల్లో కీలక ముందడుగు

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాల కల్పనలో కేంబ్రిడ్జ్‌తో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించింది. సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు హైదరాబాద్‌లో తమ విద్యా కార్యక్రమాలను విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం...
Spread the love