[t4b-ticker]
బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 31: నిజామాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయ వేడిని పెంచింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే తాను కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. ‘‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి’’ అని ఆమె నినదించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్దేశం ప్రజలు తమను తాము పాలించుకోవడం, తమ జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని కవిత అన్నారు. రాష్ట్ర సాధన కోసం...
మెస్సీకి రేవంత్ రెడ్డి అభినందనలు.. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయే

మెస్సీకి రేవంత్ రెడ్డి అభినందనలు.. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయే

ప్రతిపక్షం, ఆగస్టు 31: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ను దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మెస్సీ ప్రయాణం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మెస్సీని కలుసుకుని ఆయనతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడిపే అవకాశం లభించడం తనకు ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. 2005లో హంగేరీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ ద్వారా అర్జెంటీనా జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన మెస్సీ.. అప్పటి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనకంటూ ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్నారు. అసాధారణ ప్రతిభకు నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదలను జోడించి...
హైదరాబాద్‌కు ప్రపంచ విద్య దిగ్గజాల క్యూ.. గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌కు ప్రపంచ విద్య దిగ్గజాల క్యూ.. గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 31: హైదరాబాద్‌ను భారతదేశంలోనే తొలి, అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను హైదరాబాద్‌కు తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి నగరాన్ని ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనల్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సాధించిన పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం, హైదరాబాద్‌లో వాటి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ప్రారంభించడం ద్వారా తెలంగాణ విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని...
వెయ్యి రోజుల్లో తెలంగాణకు కొత్త దిశ.. రైతులు, మహిళలు, యువత కోసం కీలక నిర్ణయాలు: సీఎం రేవంత్‌ రెడ్డి

వెయ్యి రోజుల్లో తెలంగాణకు కొత్త దిశ.. రైతులు, మహిళలు, యువత కోసం కీలక నిర్ణయాలు: సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 31, హైదరాబాద్‌: విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. గడిచిన వెయ్యి రోజుల పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెట్టి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. మూసీ నదిపై మూసారాంబాగ్‌ వద్ద నిర్మించిన హైలెవల్‌ వంతెనను ప్రారంభించిన సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల లోగోలను ఆవిష్కరించారు. ప్రజా ప్రభుత్వం...
ప్రజా పాలన అంటే ఇదే.. వెయ్యి రోజుల్లో 72 వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజా పాలన అంటే ఇదే.. వెయ్యి రోజుల్లో 72 వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 31: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు. ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి, పేదలకు ఆహారం, ఇళ్లు, సామాజిక భద్రత వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తమ...
Spread the love