[t4b-ticker]
కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలి: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలి: కేటీఆర్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరి కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒక్క మంత్రిని బర్తరఫ్‌ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, త్వరలో మొత్తం ప్రభుత్వమే బర్తరఫ్‌ అయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్‌ డిక్లరేషన్‌లోని అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు....
ఎన్నికల్లో ఓడించేందుకు గతంలో ఈడీ, సీబీఐ.. ఇప్పుడు ఓట్ల తొలగింపు: రేవంత్‌

ఎన్నికల్లో ఓడించేందుకు గతంలో ఈడీ, సీబీఐ.. ఇప్పుడు ఓట్ల తొలగింపు: రేవంత్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో ఓట్ల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కొడంగల్‌ పర్యటనలో మాట్లాడిన సీఎం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు గతంలో ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని, ఇప్పుడు ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇదే తరహాలో వ్యవహరించి బీజేపీ విజయం సాధించిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో...
విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: మోదీ

విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: మోదీ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: యువతలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యసనం, అధిక స్క్రీన్‌ టైమ్‌ వంటి అంశాలపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 82 మంది ఉపాధ్యాయులు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు, వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వారిలో ఏవైనా ప్రతికూల మార్పులు కనిపిస్తే వాటిని గుర్తించాలని మోదీ అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు లోనుకాకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు....
రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి

రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పేవారని సీఎం గుర్తుచేశారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం చేయాలని సీఎం సూచించారు. సమాజ...
కేసీఆర్‌ భేటీ.. కాంగ్రెస్‌ ధర్నా.. రేపు హైదరాబాద్‌లో హైటెన్షన్‌

కేసీఆర్‌ భేటీ.. కాంగ్రెస్‌ ధర్నా.. రేపు హైదరాబాద్‌లో హైటెన్షన్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ రేపు బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తీరును ఎండగట్టాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే విధానం తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా...
Spread the love