[t4b-ticker]
మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్‌: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయి ప్రభుత్వానికి తిరిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సహకరించే వారితో సానుకూలంగా వ్యవహరిస్తామని, ఉద్దేశపూర్వకంగా బకాయిలను ఎగవేసేందుకు ప్రయత్నించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూలు, ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు, రానున్న...
గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 13: గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకుని రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించాలని సూచించారు. నీటి పారుదల శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ఎత్తిపోతల పరిస్థితి, పెండింగ్ పనులు, భూసేకరణ, ముంపు గ్రామాలకు పరిహారం, పునరావాసం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. గోదావరి నుంచి లభిస్తున్న నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం...
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

ప్రతిపక్షం, ఆగస్టు 11, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై సమగ్రంగా దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ప్రదర్శించేలా సమ్మిట్‌ నిర్వహణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమలకు ప్రభుత్వం...
పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 11: హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా చేపట్టనున్న పాతబస్తీ మెట్రో రైలు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెట్రో విస్తరణ పనులు, భూసేకరణ, అదనపు రైలు బోగీల కొనుగోలు, సాంకేతిక అంశాలపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండో దశ విస్తరణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 10: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రైతుల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని వేదపండితులు, రుత్వికుల మార్గదర్శకత్వంలో ప్రత్యేక పూజలు, హోమక్రతువులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రకృతి అనుకూలంగా ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు...
Spread the love