[t4b-ticker]
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరగక ఆందోళన చెందుతున్న తెలంగాణ వాసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. బాధితుల...
మూసీ ప్రాజెక్టుకు వేగం.. భూసేకరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మూసీ ప్రాజెక్టుకు వేగం.. భూసేకరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 25, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భూసేకరణలో ల్యాండ్ పూలింగ్ విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భూసేకరణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మూసీ పరివాహక ప్రాంతంలో భూముల సేకరణ సందర్భంగా...
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు?.. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ సూచనలు

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు?.. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాబోయే శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు....
ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం: రేవంత్

ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం: రేవంత్

ప్రతిపక్షం, ఆగస్టు 24: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం వ్యవహరించిన తీరు తెలంగాణ రాష్ట్రానికి, నాలుగు కోట్ల ప్రజలకు అవమానకరమని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్యా, క్రీడా రంగాల్లో అవకాశాల కోసం తాను విదేశీ పర్యటనకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి సంస్థలు, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం పర్యటన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇలాంటి అధికారిక...
అమెరికా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణపై వివక్షే: రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణపై వివక్షే: రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 24, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాల కోసం తలపెట్టిన తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ కారణాలతో పర్యటనకు అనుమతి నిరాకరించడం తెలంగాణ పట్ల వివక్ష చూపడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా స్పష్టమైన కార్యాచరణతో అమెరికా పర్యటనను రూపొందించామని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ విద్యాసంస్థలు, క్రీడా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని వివరించారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన అంశంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు....
Spread the love