[t4b-ticker]
డీజీపీపై కవిత ఫైర్‌.. ‘‘నన్ను దూషించిన పోలీస్‌ను అరెస్ట్‌ చేయండి’’

డీజీపీపై కవిత ఫైర్‌.. ‘‘నన్ను దూషించిన పోలీస్‌ను అరెస్ట్‌ చేయండి’’

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసు శాఖపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిపై కేవలం సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడం సరిపోదని, వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనలాంటి ప్రజాజీవితంలో ఉన్న మహిళపైనే అత్యంత అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి సుమారు 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనకే రక్షణ...
తుక్కుగూడ నర్సు హత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

తుక్కుగూడ నర్సు హత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు హత్యాచారానికి గురైన ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలికితీసేందుకు మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా, కేసు విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులతో పాటు బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం చోటుచేసుకుందా, మహిళా ఉద్యోగుల రక్షణకు పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలన్నింటినీ మెజిస్టీరియల్‌ విచారణలో సమగ్రంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఘటన వెనుక...
లక్ష మందితో పాదయాత్ర చేస్తా: కేసీఆర్

లక్ష మందితో పాదయాత్ర చేస్తా: కేసీఆర్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని మరోసారి ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే నీళ్ల కోసం భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల వద్దకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రజలతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మందితో పాదయాత్ర చేపడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలను...
రేవంత్ టార్గెట్.. బీఆర్‌ఎస్ టాప్-3ని ఓడించడం సాధ్యమేనా?

రేవంత్ టార్గెట్.. బీఆర్‌ఎస్ టాప్-3ని ఓడించడం సాధ్యమేనా?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల సమీకరణాలపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. నకిరేకల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ ముగ్గురినీ వారి సొంత నియోజకవర్గాల్లో ఓడిస్తామని రేవంత్ ప్రకటించడం కాంగ్రెస్ వ్యూహంపై చర్చకు దారితీసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే గజ్వేల్‌లోనే తేల్చుకుంటామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్‌ను, సిద్దిపేటలో హరీశ్‌రావును వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిస్తుందని...
సీఎం రేవంత్‌వి చిల్లర మాటలు: కేసీఆర్

సీఎం రేవంత్‌వి చిల్లర మాటలు: కేసీఆర్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్నవి చిల్లర మాటలని ఆయన మండిపడ్డారు. పాలన చేతకాక ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ప్రజలకు చెప్పుకోదగ్గ స్థాయిలో పాలన అందించలేకపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌గా మారిందని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నది మూడో తరగతి పాలన అంటూ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే...
Spread the love