గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్.. మూసీ పునరుజ్జీవనానికి కీలక ముందడుగు

గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్.. మూసీ పునరుజ్జీవనానికి కీలక ముందడుగు

ప్రతిపక్షం, జూన్ 19: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు భారత సైన్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి రావడం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దృక్పథం అమలులో కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజలకు నాణ్యమైన వినోద వనరుల కల్పన లక్ష్యాలతో ప్రభుత్వం...
మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం.. రాష్ట్ర ముఖచిత్రం మార్చే మహా ప్రాజెక్టులకు వెనక్కి తగ్గేది లేదు: రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం.. రాష్ట్ర ముఖచిత్రం మార్చే మహా ప్రాజెక్టులకు వెనక్కి తగ్గేది లేదు: రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 19: రాష్ట్ర అభివృద్ధి దిశను మార్చే మూసీ నది అభివృద్ధి ప్రణాళిక, భావి నగర నిర్మాణ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత, సురక్షిత, పర్యావరణహిత నగరాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వనమహోత్సవం–2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి ప్రజలకు పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. సభలో మాట్లాడుతూ దేశంలోని పలు మహానగరాలు ప్రస్తుతం కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు, వరదలు, మౌలిక సదుపాయాల కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరానికి రాకుండా ముందస్తు...
రైతులకు శుభవార్త.. ఈ నెల 30న ‘రైతు భరోసా’ నిధుల విడుదల – సన్న ధాన్యానికి బోనస్

రైతులకు శుభవార్త.. ఈ నెల 30న ‘రైతు భరోసా’ నిధుల విడుదల – సన్న ధాన్యానికి బోనస్

ప్రతిపక్షం, జూన్ 18: వానాకాలం సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరా, మెట్రో విస్తరణ, జాతీయ అర్హత పరీక్ష నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో భారీ రైతు సమ్మేళనం నిర్వహించి, అదే వేదికపై రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ఏడు రకాల సన్న ధాన్యాలకు...
ప్రభుత్వ విద్యలో కొత్త ప్రమాణాలు.. ఆరుట్ల పాఠశాల రాష్ట్రానికి ఆదర్శం: సీఎం రేవంత్

ప్రభుత్వ విద్యలో కొత్త ప్రమాణాలు.. ఆరుట్ల పాఠశాల రాష్ట్రానికి ఆదర్శం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోలేరనే అపోహలను తొలగించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యమని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఉన్నతాధికారులుగా ఎదగగలరనే విశ్వాసాన్ని సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యను భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామని, రాష్ట్ర బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తున్నామని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో అసమానతలు,...
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలోని డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సరదాగా గడిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేలా ఈ...
ePaper
Spread the love