కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 08: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన "కూలిన కాళేశ్వరం – వైఫల్యాల నుంచి పునర్నిర్మాణం వైపు" అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు కోరిన తేదీన అసెంబ్లీ లేదా అసెంబ్లీ–మండలి సంయుక్త సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం నిపుణులను, మేధావులను నమ్మించేలా శాస్త్రీయ పరిష్కారం చూపగలిగితే, పునరుద్ధరణ పనుల బాధ్యత వారికే అప్పగించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు. నిపుణుల నివేదికలు, భూగర్భ పరిస్థితులపై...
మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకుంటా.. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా: సీఎం రేవంత్

మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకుంటా.. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 05: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన, ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగానని, ఆ రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకున్నానని సీఎం...
మిడ్జిల్ అభివృద్ధికి రూ.47.08 కోట్ల కానుక.. ఆలయాభివృద్ధి, గ్రామాల ప్రగతి, చెక్‌డ్యామ్‌లకు సీఎం రేవంత్ శ్రీకారం

మిడ్జిల్ అభివృద్ధికి రూ.47.08 కోట్ల కానుక.. ఆలయాభివృద్ధి, గ్రామాల ప్రగతి, చెక్‌డ్యామ్‌లకు సీఎం రేవంత్ శ్రీకారం

ప్రతిపక్షం, జూలై 05: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మిడ్జిల్ పర్యటన సందర్భంగా మొత్తం రూ.47.08 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు, సాగునీటి సదుపాయాల బలోపేతానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పనులు...
ఉరుకొండపేటలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు.. రూ.10 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉరుకొండపేటలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు.. రూ.10 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

ప్రతిపక్షం, జూలై 04: రాజకీయ జీవితంలో తొలి విజయానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేటలో పర్యటించారు. తన రాజకీయ ప్రస్థానానికి చిరస్మరణీయమైన ఈ సందర్భంగా శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనతో ఉరుకొండపేట గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. రాజకీయ జీవితంలో జెడ్పీటీసీగా తొలి అడుగు వేసిన రోజులను గుర్తు చేసుకుంటూ గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ప్రజలు, ఆనాటి సహచరులు, గ్రామ పెద్దలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వాద్యాలు, పూలమాలలు, నినాదాలతో ఆయనకు...
ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు

ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటినీ ఒకే వేదికపై అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసేలా ఏఐ సాంకేతికతను...
ePaper
వ్యాపారం
Spread the love