మూడు కార్పొరేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

మూడు కార్పొరేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు....
కొడంగల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. భూసేకరణలో జాప్యం వద్దు: సీఎం రేవంత్

కొడంగల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. భూసేకరణలో జాప్యం వద్దు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 22: మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, తాగునీటి ప్రణాళికలు, రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం సహించబోమని స్పష్టం చేసిన సీఎం, ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టు అమలులో భూసేకరణ కీలక దశ అని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అవసరమైన సర్వేయర్లను...
అందెశ్రీ నాకు ఆత్మబంధువు.. ఆయన స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష: సీఎం రేవంత్

అందెశ్రీ నాకు ఆత్మబంధువు.. ఆయన స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 19: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ తనకు కేవలం ఉద్యమకారుడు మాత్రమే కాదని, ఆత్మబంధువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఆయన స్మృతి వన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందెశ్రీ కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా పరిచయమై ఉండొచ్చని.. కానీ తనకు మాత్రం ఆయన ఆత్మబంధువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ గానంలోని గొప్పతనం, ఆయన గళంలోని ఉద్యమ స్ఫూర్తి తనలోనూ చైతన్యం నింపిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగడంలో అందెశ్రీ స్ఫూర్తి కూడా ఉందని తెలిపారు. తాను...
ఎల్‌నినో, వర్షాభావంపై కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణి అక్రమాలపై సిట్

ఎల్‌నినో, వర్షాభావంపై కేబినెట్ కీలక నిర్ణయాలు.. ధరణి అక్రమాలపై సిట్

ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ కేబినెట్ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి, నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనుంది. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఎల్‌నినో...
క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం.. విజేతలకు నగదు బహుమతులు, ఉద్యోగాలు: సీఎం రేవంత్

క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం.. విజేతలకు నగదు బహుమతులు, ఉద్యోగాలు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడల్లో ప్రతిభ చూపే వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇటీవల విజయవంతంగా ముగిసిన తొలి సీజన్ టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జట్టు సభ్యులను అభినందించారు. విజేతలకు నగదు బహుమతులకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో...
ePaper
వ్యాపారం
Spread the love