[t4b-ticker]
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యా దిగ్గజం.. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ప్రకటన

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ విద్యా దిగ్గజం.. రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ప్రకటన

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాలపై ఆ విద్యాసంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృతంగా చర్చించారు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ సెనేట్ హౌస్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన, విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులకు వివరించింది. తెలంగాణలో ఉన్న...
కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యం.. విద్య, పరిశోధన రంగాల్లో కీలక ముందడుగు

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యం.. విద్య, పరిశోధన రంగాల్లో కీలక ముందడుగు

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాల కల్పనలో కేంబ్రిడ్జ్‌తో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించింది. సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు హైదరాబాద్‌లో తమ విద్యా కార్యక్రమాలను విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం...
ఆక్స్‌ఫర్డ్‌తో భాగస్వామ్యానికి సీఎం రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా కేంద్రం

ఆక్స్‌ఫర్డ్‌తో భాగస్వామ్యానికి సీఎం రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి విద్యా కేంద్రం

ప్రతిపక్షం, ఆగస్టు 22: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలను మరింత విస్తరించే దిశగా కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం.. హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్‌ విద్యా కార్యక్రమాలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బ్లోవాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్‌ను వారికి వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు...
నిత్యావసర ధరల భారం.. సామాన్యుడి బడ్జెట్‌కు బీటలు

నిత్యావసర ధరల భారం.. సామాన్యుడి బడ్జెట్‌కు బీటలు

ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతం అటు ఈఎంఐలు.. ఇటు విద్య, అద్దె, రవాణా ఖర్చులు జీతం పెరుగుదల కంటే ఖర్చులే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్న మధ్యతరగతి పొదుపు, భవిష్యత్‌ అవసరాలపై తగ్గుతున్న వెసులుబాటు ప్రతిపక్షం,ఆగస్టు 22, నేషనల్ డెస్క్: నెల జీతం చేతికి వచ్చినా.. అది ఇంటి ఖర్చుల గడప దాటేలోపే కరిగిపోతోంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు పిల్లల చదువులు, ఇంటి అద్దె, విద్యుత్‌ బిల్లులు, రవాణా వ్యయం, వైద్య ఖర్చులు.. వీటికి తోడు ఇల్లు, వాహనం, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా.. తప్పనిసరి వ్యయాలకు కోత పెట్టే పరిస్థితి లేకపోవడంతో పొదుపు చేయడం కష్టమవుతోందన్న ఆందోళన కుటుంబాల్లో వ్యక్తమవుతోంది....
అమెరికా పర్యటన రద్దు.. యూకేలోనే కొనసాగనున్న సీఎం రేవంత్ పర్యటన

అమెరికా పర్యటన రద్దు.. యూకేలోనే కొనసాగనున్న సీఎం రేవంత్ పర్యటన

ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చేపట్టిన అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలుత యూకే, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోరగా.. యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి, విస్మయం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం...
Spread the love