21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 26, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే జెన్‌జీ (Gen Z) యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణను పార్లమెంట్‌లో తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో "యువతే దేశం – దేశమే యువత" పేరుతో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ వంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆత్మహత్యలు,...
డ్రగ్స్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలకూ బాధ్యత.. కఠిన చట్టంపై సీఎం రేవంత్ ఆదేశాలు

డ్రగ్స్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలకూ బాధ్యత.. కఠిన చట్టంపై సీఎం రేవంత్ ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 25: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో యాజమాన్యాలకూ బాధ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ప్రాంగణంలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా సంబంధిత యాజమాన్యాలు కూడా జవాబుదారులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యాసంస్థల క్యాంపస్‌లతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం...
క్యూర్ పరిధిలో జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

క్యూర్ పరిధిలో జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ గృహాలు జనావాసాలకు దూరంగా కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల మధ్యలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఉపాధి, రవాణా, విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల పోలీసు, రెవెన్యూ, రవాణా తదితర శాఖలకు చెందిన నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అలాంటి భూములను గృహ నిర్మాణానికి వినియోగించి,...
మూడు కార్పొరేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

మూడు కార్పొరేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని ఇప్పటికే నియమించినట్లు వెల్లడించారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు....
కొడంగల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. భూసేకరణలో జాప్యం వద్దు: సీఎం రేవంత్

కొడంగల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. భూసేకరణలో జాప్యం వద్దు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 22: మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, తాగునీటి ప్రణాళికలు, రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం సహించబోమని స్పష్టం చేసిన సీఎం, ప్రతి పనికి నిర్దిష్ట గడువు విధించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టు అమలులో భూసేకరణ కీలక దశ అని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అవసరమైన సర్వేయర్లను...
ePaper
Spread the love