[t4b-ticker]
పరకాలకు భారీ నిధులు.. రూ.449 కోట్లకుపైగా పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు

పరకాలకు భారీ నిధులు.. రూ.449 కోట్లకుపైగా పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు

ప్రతిపక్షం, ఆగస్టు 16, హనుమకొండ: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అభివృద్ధి వరాలు ప్రకటించింది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, సాంకేతిక శిక్షణ, మహిళా సాధికారత వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే పూర్తైన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. పరకాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని...
ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ములుగు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 16, ములుగు: ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ములుగు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు....
గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. 2,145 రోడ్లకు శుభారంభం

గ్రామీణ రహదారుల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం.. 2,145 రోడ్లకు శుభారంభం

ప్రతిపక్షం, ఆగస్టు 16, ములుగు: తెలంగాణలో గ్రామీణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభారంభం పలికారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన రహదారుల అభివృద్ధి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారుల అభివృద్ధికి సంబంధించిన పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానానికి కొత్త దశకు శ్రీకారం చుట్టినట్లయింది. గ్రామాల నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం...
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో మహిళలతో సీఎం రేవంత్ ముచ్చట

సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో మహిళలతో సీఎం రేవంత్ ముచ్చట

ప్రతిపక్షం, ఆగస్టు 16, మేడారం: వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మేడారంలో స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు, భక్తులను కలుసుకున్నారు. వారితో వరుసగా మాట్లాడిన సీఎం.. వారి సమస్యలు, అవసరాలను శ్రద్ధగా విని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సంఘాల ద్వారా కొనసాగుతున్న ఉపాధి కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, మహిళల స్వయం ఉపాధికి అందుతున్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు తమ అనుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. వారు చెప్పిన విషయాలను రేవంత్ రెడ్డి శ్రద్ధగా విని, మహిళల ఆర్థిక...
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో పింఛన్ల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం

సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో పింఛన్ల పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం

ప్రతిపక్షం, ఆగస్టు 16, ములుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల సన్నిధిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూతగా అందించే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు స్వయంగా పింఛన్లు అందజేసి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. డోలు వాయిద్యాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కులో భాగంగా వనదేవతలకు...
Spread the love