[t4b-ticker]
22ఏ అంశంపై రేపు కీలక చర్చ.. మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం

22ఏ అంశంపై రేపు కీలక చర్చ.. మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 15, హైదరాబాద్‌: 22ఏ భూముల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలకు తెరదించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని స్పష్టంగా వివరించడంతో పాటు, గతంలో ధరణి వ్యవస్థలో 22ఏ పేరుతో జరిగిన అక్రమాలు, భూవ్యవహారాల్లో చోటుచేసుకున్న అవకతవకలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు శాసనసభలో 22ఏ అంశంపై విస్తృతంగా చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు వాస్తవాలు, గణాంకాలతో సమాధానం ఇచ్చేలా ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని...
గాంధీ భవన్‌లో వినాయక చవితి వేడుకలు.. మహేష్ కుమార్ గౌడ్‌కు జగ్గారెడ్డి శుభాకాంక్షలు

గాంధీ భవన్‌లో వినాయక చవితి వేడుకలు.. మహేష్ కుమార్ గౌడ్‌కు జగ్గారెడ్డి శుభాకాంక్షలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 14, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పండుగ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. వినాయక చవితి పర్వదినం ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఐక్యతను తీసుకురావాలని నేతలు ఆకాంక్షించారు....
రోశయ్య సలహాతో నాయకుడిగా ఎదిగా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

రోశయ్య సలహాతో నాయకుడిగా ఎదిగా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 13: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. 2007లో శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను ప్రత్యేకంగా పిలిపించుకుని పలు సూచనలు చేశారని తెలిపారు. రాజకీయాల్లో ఆవేశం సహజమే అయినప్పటికీ దాన్ని కొంత తగ్గించుకుని, అనుభవాన్ని జోడించుకుంటే తిరుగులేని నాయకుడిగా ఎదుగుతావని రోశయ్య తనను ప్రోత్సహించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్యవైశ్య సమాజానికి చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు....
ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన.. పేద కుటుంబాలకు సీఎం భరోసా

ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన.. పేద కుటుంబాలకు సీఎం భరోసా

ప్రతిపక్షం, సెప్టెంబర్ 13: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యులు సౌమ్యత, మానవతా దృక్పథంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదల పట్ల విశ్వాసంతో వ్యవహరించే వర్గంగా వారికి మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవన నిర్మాణం కేవలం ఒక భవనాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా ఆర్యవైశ్య సమాజానికి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పిల్లలు, విద్యార్థులు, యువతకు ఈ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చర్యలు...
బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్‌.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్‌.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలన్నీ కలిసి ఢిల్లీ ప్రకటనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఉద్రిక్తతలు, రాజకీయ సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలో బ్రిక్స్ దేశాలన్నీ ఒకే ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదాలకు యుద్ధమే పరిష్కారం కాదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని బ్రిక్స్ దేశాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ఈ శిఖరాగ్ర సమావేశం అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ప్రతిపాదించిన పది కీలక అంశాలకు సభ్య దేశాల నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఢిల్లీ ప్రకటనను ప్రవేశపెట్టిన సమయంలో ఎలాంటి...
Spread the love