పాలమూరు–రంగారెడ్డికి త్వరలో శుభవార్త.. 90 టీఎంసీల నీటి అనుమతుల కోసం కసరత్తు: సీఎం రేవంత్

పాలమూరు–రంగారెడ్డికి త్వరలో శుభవార్త.. 90 టీఎంసీల నీటి అనుమతుల కోసం కసరత్తు: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 15: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపుల అంశంపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు పూర్తి అనుమతులు...
2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అమెజాన్ డేటా సెంటర్‌తో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం: సీఎం రేవంత్

2034 నాటికి లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అమెజాన్ డేటా సెంటర్‌తో ఫ్యూచర్ సిటీకి శ్రీకారం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణను అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2034 నాటికి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తొలి మెట్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు...
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 14, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల సాధనలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని సీఎం కోరారు. హైదరాబాద్‌లో భారతీయ...
కాళేశ్వరం పునరుద్ధరణకు ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలే ప్రామాణికం.. నిపుణుల సూచనలతోనే ముందుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం పునరుద్ధరణకు ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలే ప్రామాణికం.. నిపుణుల సూచనలతోనే ముందుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 12: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణను పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచనలు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సిఫారసుల మేరకే చేపడతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ప్రస్తుతం నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నందువల్లే ప్రభుత్వం నీటిని ఎత్తిపోసే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్ఏ తుది నివేదిక వెల్లడించిందన్నారు. మేడిగడ్డలోని ఏడో బ్లాక్ పిల్లర్లు కుంగిపోవడం వల్ల మొత్తం బ్యారేజీ...
‘ముళ్ల’ బంధం

‘ముళ్ల’ బంధం

నెత్తురొడుతున్న వివాహ బంధం వరుస హత్యలతో కలకలం అక్రమ సంబంధాల మోజులో హత్యలు చెరసాల పాలవుతున్న ప్రేయసీ, ప్రియులు విడిపోయే అవకాశాలున్నా అంతమొందించడమే లక్ష్యం కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నం వైవాహిక బంధాలపై ఆందోళన ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే కారణమా? (రాందేని చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు) ప్రతిపక్షం, జూలై 11: ‘నూరేళ్ళ జీవితం.. అగ్నిసాక్షిగా వేసిన ఏడడుగులు.. సుఖఃదుఃఖాల్లో తోడుంటాననే ప్రమాణం..’ వివాహ బంధం గురించి మనం చెప్పుకునే గొప్ప మాటలివి. నేడు కొన్నిచోట్ల ఈ పవిత్ర బంధం నెత్తురోడుతోంది. క్షణికావేశం, అక్రమ సంబంధాలు, ఆస్తి వ్యామోహం.. కారణం ఏదైనా కావచ్చు, ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తలను భార్యలే కడతేరుస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కట్టుకున్నవాడే అని కూడా చూడకుండా...
ePaper
Spread the love