మహిళా సాధికారతకు భారీ ఊతం.. మరో 3 వేల బస్సులు మహిళా సంఘాలకే: సీఎం రేవంత్ రెడ్డి

మహిళా సాధికారతకు భారీ ఊతం.. మరో 3 వేల బస్సులు మహిళా సంఘాలకే: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 10: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే స్వయం సహాయక సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగించిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన అందజేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణకు అప్పగించే కార్యక్రమాన్ని...
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం.. వచ్చే రెండున్నరేళ్లు వికాసంపైనే దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం.. వచ్చే రెండున్నరేళ్లు వికాసంపైనే దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 09: రాష్ట్ర రాజధానిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ నగర విస్తరణకు అనుగుణంగా రవాణా, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి రంగాల్లో సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. గాజులరామారంలో వంద ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్సు కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నగర ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకు మెట్రో రైలు మార్గాల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం పెద్ద...
మూసీ ప్రక్షాళన రెండో దశకు వంద రోజుల్లో శ్రీకారం: ముఖ్యమంత్రి రేవంత్

మూసీ ప్రక్షాళన రెండో దశకు వంద రోజుల్లో శ్రీకారం: ముఖ్యమంత్రి రేవంత్

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 08: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు చేపట్టనున్న రెండో దశ పనులను వంద రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు తొలి దశ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్‌లో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనంతో పాటు, ప్రత్యామ్నాయ రహదారులు, ఎగువ వంతెనలు, జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సమగ్ర బిల్లింగ్, వసూళ్ల వ్యవస్థ కోసం రూపొందించిన ప్రత్యేక అనువర్తనాన్ని...
పాలమూరు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం 2027.. 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం 2027.. 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 06: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న సాగు, తాగునీటి ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. గత రెండు రోజులుగా పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల అమలులో...
సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

ప్రతిపక్షం, జూన్ 05: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న పలు ఎత్తిపోతల, సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. జిల్లా అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు అత్యంత కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగా పనులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని సీఎం సూచించారు. భూసేకరణ...
ePaper
Spread the love