యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం

యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం

ప్రతిపక్షం, జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలకు భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి అదే తరహాలో భూముల కేటాయింపు విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని సూచించారు. గుట్టపై అతిథి గృహాల నిర్మాణానికి ఆసక్తి చూపే వారి జాబితా రూపొందించి,...
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 29: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మూసీ నది ప్రక్షాళన పనులను పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్‌లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన తన కల అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే తెలంగాణ పట్టణ ఆర్థిక,...
రూ.13,060 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

రూ.13,060 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 29: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ద్వారా చేపట్టనున్న భారీ రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పైలాన్ ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.13,060 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల కింద మొత్తం 441 రహదారులను విస్తరించనున్నారు. ఈ...
రగ్బీ ప్రీమియర్ లీగ్-2 విజేతగా హైదరాబాద్ హీరోస్.. ట్రోఫీ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

రగ్బీ ప్రీమియర్ లీగ్-2 విజేతగా హైదరాబాద్ హీరోస్.. ట్రోఫీ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 29: గచ్చీబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్-2026 సీజన్-2లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ముంబయ్ డ్రీమర్స్‌పై 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించి విజేత జట్టుకు అభినందనలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు రగ్బీ ప్రీమియర్ లీగ్-2026 ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు కొణిదెల చిరంజీవి, రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, ఒలింపియన్ పీవీ సింధు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేనారెడ్డి, నటి మృణాల్...
మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష.. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, తొలి దశ పనులకు వేగం

మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష.. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, తొలి దశ పనులకు వేగం

ప్రతిపక్షం, జూన్ 27: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, పునరావాసం, అభివృద్ధి పనులపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన భూముల సేకరణలో ప్రజలకు...
ePaper
Spread the love