[t4b-ticker]
విద్యార్థుల యూనిఫాం మరింత ఆకర్షణీయంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థుల యూనిఫాం మరింత ఆకర్షణీయంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 20: విద్యార్థులకు అందించే పాఠశాల యూనిఫాంలను మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరమైన రంగుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం డిజైన్లలోనూ వైవిధ్యం ఉండేలా కొత్త నమూనాలను పరిశీలించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాంలు, నోటు పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో పంపిణీ పూర్తయిన సామగ్రి వివరాలతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండో జత యూనిఫాంను కూడా ఈ...
జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్ ఢీకొని యాక్టివాపై వెళ్తున్న యువతీ, యువకుడు దుర్మరణం ప్రతిపక్షం, జవహర్‌నగర్, సెప్టెంబర్ 20: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ–ఎల్లారెడ్డిగూడెం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివాపై వెళ్తున్న దీప్సిక (19), అమర్దొయ (15) ను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.వినాయక మండపంలో అన్నదానం కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించండి: సీఎం రేవంత్

వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించండి: సీఎం రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 19: వరంగల్‌ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని ప్రజలను కోరారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, భూమిని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు అప్పగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. వరంగల్‌ ప్రాంత అభివృద్ధిలో విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. వరంగల్‌ను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి విమానాశ్రయం ఉపయోగపడుతుందని గతంలో కేంద్ర ప్రభుత్వంతో...
వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర: భట్టి విక్రమార్క

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర: భట్టి విక్రమార్క

ప్రతిపక్షం, సెప్టెంబర్ 19: వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి, దేశ అభివృద్ధిలో రాష్ట్రం వాటాను గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం కేవలం ప్రభుత్వ నిధులు, రుణాలపై ఆధారపడకుండా ప్రైవేటు, సంస్థాగత పెట్టుబడులను భారీగా ఆకర్షించాల్సిన అవసరం...
బీసీల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది: కవిత

బీసీల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది: కవిత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 18: కుల వివక్ష నిర్మూలనకు సమాజంలో ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఐక్య వేదిక, సకల జన సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాలిటిక్స్‌ బియాండ్‌ క్యాస్ట్‌’ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నవారికైనా కుల వివక్ష తప్పడం లేదని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు సైతం వివక్షను ఎదుర్కొన్న సందర్భాలను చూశామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో లక్షలాది మంది తమకు తెలియకుండానే ప్రతిరోజూ కుల వివక్షను ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. ఇటీవల లంబాడాలకు ఇళ్లు ఇవ్వబోమంటూ ఎక్కడో ఒక చోట బోర్డు పెట్టిన ఘటనను ప్రస్తావిస్తూ.....
Spread the love