[t4b-ticker]
తెలంగాణలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి నేరుగా రూ.1 లక్ష సాయం.. అకౌంట్లో పడేది అప్పుడే..

తెలంగాణలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి నేరుగా రూ.1 లక్ష సాయం.. అకౌంట్లో పడేది అప్పుడే..

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: తెలంగాణలో స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన యువతకు ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక వంటి ప్రక్రియలు పూర్తయ్యాయని, ఎంపికైన లబ్ధిదారులకు నవంబర్‌ నుంచి నిధులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోంది. తమకు ఆసక్తి ఉన్న రంగంలో చిన్న వ్యాపారం లేదా ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఈ సాయం ఉపయోగపడేలా పథకాన్ని...
మాట తప్పడం.. మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్: కవిత

మాట తప్పడం.. మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్: కవిత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే వారిని బెదిరించడం సరికాదని, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ బానిసలు కారనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని కవిత పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు తెలంగాణ సాధన కోసం వారు ఉద్యమంలో ముందుండి పనిచేశారని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పాలన అందించాలంటే ప్రభుత్వ...
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.. ఆగా ఖాన్ ఫౌండేషన్‌కు రేవంత్‌ విజ్ఞప్తి

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.. ఆగా ఖాన్ ఫౌండేషన్‌కు రేవంత్‌ విజ్ఞప్తి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింతగా భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యాటకం, చారిత్రక వారసత్వ పరిరక్షణ రంగాల్లో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆగా ఖాన్ ఫౌండేషన్‌పై తనకు, తెలంగాణ ప్రభుత్వానికి...
రేవంత్‌ రెడ్డి ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉంది: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉంది: కేటీఆర్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 15: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఏదో ఒక కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మధ్య వ్యత్యాసం ఉందని విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు చర్యలు...
22ఏ అంశంపై రేపు కీలక చర్చ.. మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం

22ఏ అంశంపై రేపు కీలక చర్చ.. మంత్రులతో సీఎం రేవంత్‌ సమావేశం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 15, హైదరాబాద్‌: 22ఏ భూముల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలకు తెరదించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని స్పష్టంగా వివరించడంతో పాటు, గతంలో ధరణి వ్యవస్థలో 22ఏ పేరుతో జరిగిన అక్రమాలు, భూవ్యవహారాల్లో చోటుచేసుకున్న అవకతవకలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు శాసనసభలో 22ఏ అంశంపై విస్తృతంగా చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు వాస్తవాలు, గణాంకాలతో సమాధానం ఇచ్చేలా ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని...
Spread the love