[t4b-ticker]
పోరాట యోధులకు పుట్టినిల్లు తెలంగాణ: రేవంత్‌ రెడ్డి

పోరాట యోధులకు పుట్టినిల్లు తెలంగాణ: రేవంత్‌ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులకు తెలంగాణ పుట్టినిల్లు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం తెలంగాణ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 17కు తెలంగాణ సుదీర్ఘ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యానికి, అన్యాయాన్ని ఎదిరించే పోరాటాలకు వేదికగా నిలిచిందన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే అదే సమయంలో పాలన...
కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్

కేసీఆర్, రేవంత్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: తెలంగాణలో భూములు, ఆస్తులకు సంబంధించిన రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. కేసీఆర్ ఆస్తులపై నిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన సవాల్ చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపైనా ఇదే తరహాలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తమకు ఎలాంటి విచారణకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తులపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నింటినీ పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కుటుంబానికి...
ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

ధరణి భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని భూముల విషయంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. భూముల దోపిడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించి సమగ్రంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భూ సమస్యల చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణలో భూములకు సంబంధించి కాలక్రమంలో నాలుగు ప్రధాన రకాల సమస్యలు ఏర్పడ్డాయని రేవంత్‌ రెడ్డి వివరించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను సభ ముందుంచారు. భూముల రికార్డులు,...
ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ

ప్రచారక్ టూ ప్రధాని.. గ్లోబల్ లీడర్‌గా మోదీ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: గుజరాత్‌లోని వాద్‌నగర్‌ నుంచి దేశ ప్రధానమంత్రి పదవి వరకు సాగిన నరేంద్ర మోదీ ప్రస్థానం భారత రాజకీయాల్లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. 1950 సెప్టెంబర్‌ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జన్మించిన మోదీ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో కార్యకర్తగా పనిచేస్తూ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. మోదీ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కీలక పాత్ర పోషించింది. 1970ల ప్రారంభంలో అహ్మదాబాద్‌లో సంఘ్‌తో అనుబంధం ఏర్పరుచుకున్న ఆయన ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో సంస్థాగత కార్యక్రమాలు, ప్రజలతో మమేకం కావడం, వివిధ...
22ఏ భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం.. హైపవర్ కమిటీ ఏర్పాటు: రేవంత్

22ఏ భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం.. హైపవర్ కమిటీ ఏర్పాటు: రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 16: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న నిరుపేదల ఆస్తుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. నిరుపేదలకు సంబంధించిన న్యాయమైన, చట్టబద్ధమైన ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి చెందిన ప్రత్యేక కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారితో ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పెండింగ్ దరఖాస్తులు, చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలించనుంది....
Spread the love