[t4b-ticker]
వివక్ష లేని సంక్షేమమే ప్రజా పాలన: సీఎం రేవంత్

వివక్ష లేని సంక్షేమమే ప్రజా పాలన: సీఎం రేవంత్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 06, నకిరేకల్: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రధానంగా పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించారు. నకిరేకల్‌లో రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అమలు...
సిరిసిల్లపై దండయాత్ర చేస్తాం.. ఆ తర్వాత సిద్దిపేటే: సీఎం రేవంత్‌ సంచలన సవాల్‌

సిరిసిల్లపై దండయాత్ర చేస్తాం.. ఆ తర్వాత సిద్దిపేటే: సీఎం రేవంత్‌ సంచలన సవాల్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలాన్ని చాటేందుకు కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కలను పీకేస్తామని సీఎం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల రాజకీయ భవిష్యత్తు ఇక చీకటిమయంగా మారనుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలాన్ని మరింత పెంచుతామని, బీఆర్‌ఎస్‌ ప్రభావాన్ని తగ్గిస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక...
ఉపాధ్యాయుల సమస్యలన్నింటికీ బాధ్యత నాదే.. రెండేళ్లు నన్ను నమ్మండి: సీఎం రేవంత్‌

ఉపాధ్యాయుల సమస్యలన్నింటికీ బాధ్యత నాదే.. రెండేళ్లు నన్ను నమ్మండి: సీఎం రేవంత్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ, ఇంక్రిమెంట్లు సహా ఉపాధ్యాయులు, లెక్చరర్లకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తనకు రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యా రంగ సంస్కరణలకు ఉపాధ్యాయులు సహకరించాలని, తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడంలో వారే కీలక పాత్ర పోషించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి...
కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలి: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలి: కేటీఆర్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరి కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన 420 హామీలకు 420 సార్లు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒక్క మంత్రిని బర్తరఫ్‌ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, త్వరలో మొత్తం ప్రభుత్వమే బర్తరఫ్‌ అయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్‌ డిక్లరేషన్‌లోని అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు....
ఎన్నికల్లో ఓడించేందుకు గతంలో ఈడీ, సీబీఐ.. ఇప్పుడు ఓట్ల తొలగింపు: రేవంత్‌

ఎన్నికల్లో ఓడించేందుకు గతంలో ఈడీ, సీబీఐ.. ఇప్పుడు ఓట్ల తొలగింపు: రేవంత్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో ఓట్ల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కొడంగల్‌ పర్యటనలో మాట్లాడిన సీఎం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు గతంలో ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని, ఇప్పుడు ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇదే తరహాలో వ్యవహరించి బీజేపీ విజయం సాధించిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో...
Spread the love