[t4b-ticker]
పేదలకు ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకం తెస్తాం: కవిత

పేదలకు ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకం తెస్తాం: కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 18, హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కవిత అన్నారు. సామాజిక న్యాయంపై తమ పార్టీ నిర్వహించిన సంకల్ప సభ తర్వాతే ప్రభుత్వం ఆ అంశంపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మాటల్లో సామాజిక న్యాయం చెబుతూ.....
ఏడాదిన్నరలో మరో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి

ఏడాదిన్నరలో మరో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 18: హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, అల్వాల్ టిమ్స్, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి చొప్పున నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సనత్‌నగర్‌లో ప్రారంభించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌లో గుండె, మూత్రపిండాలు, అవయవ మార్పిడి చికిత్సలకు...
సనత్‌నగర్‌ టిమ్స్‌లో వైద్య సేవలపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష.. అత్యాధునిక వైద్య సేవలపై అధికారులకు కీలక సూచనలు

సనత్‌నగర్‌ టిమ్స్‌లో వైద్య సేవలపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష.. అత్యాధునిక వైద్య సేవలపై అధికారులకు కీలక సూచనలు

ప్రతిపక్షం, ఆగస్టు 17: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను మంత్రులతో కలిసి పరిశీలించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణ, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్డియో, రీనల్‌, అవయవ మార్పిడి వైద్య విభాగాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లు, శస్త్రచికిత్స అనంతర వార్డులు, ట్రామా విభాగం, ఐసీయూలను సీఎం పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉన్న వైద్య పరికరాల పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగులకు అందించే చికిత్స విధానాల గురించి వైద్యులను అడిగి...
నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి.. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్

నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి.. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, ఆగస్టు 17, హనుమకొండ: రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి మాటలను నమ్మి యువత సమయాన్ని వృథా చేసుకోవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వంలోని ఖాళీలన్నింటినీ దశలవారీగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పరకాల నియోజకవర్గంలో ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.424 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖాళీలన్నీ...
పరకాలకు భారీ నిధులు.. రూ.449 కోట్లకుపైగా పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు

పరకాలకు భారీ నిధులు.. రూ.449 కోట్లకుపైగా పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు

ప్రతిపక్షం, ఆగస్టు 16, హనుమకొండ: హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అభివృద్ధి వరాలు ప్రకటించింది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, సాంకేతిక శిక్షణ, మహిళా సాధికారత వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే పూర్తైన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. పరకాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని...
Spread the love