తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 02, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రాన్ని ప్రపంచానికి గేట్‌వేగా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రజలంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, రెండున్నరేళ్లలో వ్యవసాయం, రైతు...
ధాన్యం కొనుగోలుపై రైతులకు భరోసా.. ప్రతి గింజా కొంటాం: సీఎం

ధాన్యం కొనుగోలుపై రైతులకు భరోసా.. ప్రతి గింజా కొంటాం: సీఎం

ప్రతిపక్షం, జూన్ 02: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాలకు తడిసిన ధాన్యానికీ కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభలో మాట్లాడిన సీఎం, ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. మద్దతు ధర ప్రకటించడమే కాకుండా పండించిన పంటను కొనుగోలు చేయడం కూడా కేంద్ర బాధ్యతేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మొత్తం 75 లక్షల మెట్రిక్...
పిల్లలను చదివించండి.. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి: సీఎం రేవంత్ రెడ్డి

పిల్లలను చదివించండి.. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 02: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్తగూడ గ్రామంలో నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్న ఆయన, ప్రతిఫలంగా తమకు ఒక్కటే కావాలని కోరారు. “మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే, మీ పిల్లలను మాత్రం తప్పకుండా చదివించాలి. విద్యే మీ కుటుంబాల జీవితాలను మార్చగల శక్తి” అని మహిళలకు సీఎం సూచించారు. పిల్లలను చదివిస్తామని మహిళల నుంచి మాట కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి...
ఫ్లాష్.. ఫ్లాష్.. అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్

ఫ్లాష్.. ఫ్లాష్.. అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్

భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు. పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా. సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి...
3కార్పొరేషన్లుగా హైదరాబాద్​.. గెజిట్​ విడుదల

3కార్పొరేషన్లుగా హైదరాబాద్​.. గెజిట్​ విడుదల

ప్రతిపక్షం, హైదరాబాద్​, ఫిబ్రవరి 11:గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎంఎంసీ), సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (సీఎంసీ)లను ఏర్పాటు చేస్తూ గెజిట్​ విడుదల చేసింది. అలాగే ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్​ఎంసీ కమిషనర్​ గా ఆర్ వీ కర్ణన్​ ను యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం సైబరాబాద్​ కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్​ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించింది. జీహెచ్​ ఎంసీ లోని 150 డివిజన్లు డి లిమిటేషన్​ లో భాగంగా 243 డివిజన్లుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు 57 డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. పరిపాలన సౌలభ్యం,...
ePaper
Spread the love