[t4b-ticker]
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రేషన్ కార్డుల నుంచి ఈవీ ఆటోల వరకు భారీ ప్రకటనలు

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రేషన్ కార్డుల నుంచి ఈవీ ఆటోల వరకు భారీ ప్రకటనలు

ప్రతిపక్షం, ఆగస్టు 14, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఘనంగా చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీంతో పాటు తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0, రైతులు, నైపుణ్య విద్య, పాఠశాలలు, ఈవీ ఆటోలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 3.42 కోట్ల మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు గతంలో రాష్ట్రంలో 2.81 కోట్ల మంది రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఉండగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్‌ కార్డులు జారీ...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2.0కు ఆమోదం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2.0కు ఆమోదం

ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణలో పెట్టుబడులను భారీగా ఆకర్షించడంతో పాటు రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సుమారు మూడు గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2.0 నిర్వహించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రధాన ఇతివృత్తంగా.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రధాన ఇతివృత్తంగా గ్లోబల్ సమ్మిట్‌ 2.0ను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశ,...
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. 9 భద్రతా ఫీచర్లు, స్పర్శతోనూ గుర్తింపు!

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. 9 భద్రతా ఫీచర్లు, స్పర్శతోనూ గుర్తింపు!

ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీ ప్రారంభం కానుంది. నకిలీ కార్డులను అరికట్టడంతో పాటు కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించేలా ప్రభుత్వం ఆధునిక భద్రతా ప్రమాణాలతో వీటిని రూపొందించింది. మొత్తం 9 రకాల భద్రతా అంశాలను కార్డులో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలతో పాటు లబ్ధిదారుడి వివరాలు, రేషన్ దుకాణం నంబర్, అధికారిక సంతకం వంటి వివరాలు ఉంటాయి. కార్డు ముందు, వెనుక భాగాల్లో కనిపించే, కనిపించని, స్పర్శ ద్వారా గుర్తించగలిగే, డిజిటల్‌గా ధ్రువీకరించగలిగే భద్రతా...
హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 13, హైదరాబాద్: హిందూ, ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, రెండు వర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో సీఎం పాల్గొన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన 782 మంది మైనారిటీ అభ్యర్థులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు....
22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక భరోసా

22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక భరోసా

ప్రతిపక్షం, ఆగస్టు 13: హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులకు కీలక భరోసా ఇచ్చారు. ఏదైనా కారణంతో తమ భూములు నిషేధిత జాబితా 22ఏలో చేరాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హక్కుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్థానిక భూముల సమస్యను ప్రస్తావించిన సీఎం.. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి మిగిలిన భూములకు సర్వే నంబర్ల...
Spread the love