కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం.. సోలార్ తయారీ యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్

కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం.. సోలార్ తయారీ యూనిట్ ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 09: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని మొత్తం కోర్ అర్బన్ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోలార్ ఆక్సీ ట్రీ, సోలార్ ఆధారిత వీధి దీపాలు, గాలి శుద్ధి వ్యవస్థతో పాటు సంస్థ తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి...
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హై కమిషనర్ కీలక భేటీ.. కెనడా పర్యటనకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హై కమిషనర్ కీలక భేటీ.. కెనడా పర్యటనకు ఆహ్వానం

ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, విద్య, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఇరు పక్షాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, భవిష్యత్ ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్య అవకాశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కెనడా–తెలంగాణ మధ్య వేగంగా విస్తరిస్తున్న సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఇరువర్గాలు అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా వాణిజ్యం, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, ఆధునిక...
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 08: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన "కూలిన కాళేశ్వరం – వైఫల్యాల నుంచి పునర్నిర్మాణం వైపు" అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు కోరిన తేదీన అసెంబ్లీ లేదా అసెంబ్లీ–మండలి సంయుక్త సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం నిపుణులను, మేధావులను నమ్మించేలా శాస్త్రీయ పరిష్కారం చూపగలిగితే, పునరుద్ధరణ పనుల బాధ్యత వారికే అప్పగించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు. నిపుణుల నివేదికలు, భూగర్భ పరిస్థితులపై...
మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకుంటా.. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా: సీఎం రేవంత్

మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకుంటా.. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 05: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన, ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగానని, ఆ రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకున్నానని సీఎం...
మిడ్జిల్ అభివృద్ధికి రూ.47.08 కోట్ల కానుక.. ఆలయాభివృద్ధి, గ్రామాల ప్రగతి, చెక్‌డ్యామ్‌లకు సీఎం రేవంత్ శ్రీకారం

మిడ్జిల్ అభివృద్ధికి రూ.47.08 కోట్ల కానుక.. ఆలయాభివృద్ధి, గ్రామాల ప్రగతి, చెక్‌డ్యామ్‌లకు సీఎం రేవంత్ శ్రీకారం

ప్రతిపక్షం, జూలై 05: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మిడ్జిల్ పర్యటన సందర్భంగా మొత్తం రూ.47.08 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆలయాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు, సాగునీటి సదుపాయాల బలోపేతానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.10 కోట్లతో చేపట్టనున్న పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పనులు...
ePaper
వ్యాపారం
Spread the love