[t4b-ticker]
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యం.. డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’

ప్రతిపక్షం, ఆగస్టు 11, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై సమగ్రంగా దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ప్రదర్శించేలా సమ్మిట్‌ నిర్వహణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమలకు ప్రభుత్వం...
పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 11: హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా చేపట్టనున్న పాతబస్తీ మెట్రో రైలు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెట్రో విస్తరణ పనులు, భూసేకరణ, అదనపు రైలు బోగీల కొనుగోలు, సాంకేతిక అంశాలపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండో దశ విస్తరణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 10: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రైతుల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని వేదపండితులు, రుత్వికుల మార్గదర్శకత్వంలో ప్రత్యేక పూజలు, హోమక్రతువులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రకృతి అనుకూలంగా ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు...
జీఎస్టీ ఆదాయం పెంచేందుకు ఏఐ వినియోగం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జీఎస్టీ ఆదాయం పెంచేందుకు ఏఐ వినియోగం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 08: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు కృత్రిమ మేధస్సు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలు చేపట్టడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం, ఆదాయ వనరులను పెంచడం, పన్నుల వసూళ్లలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన...
రోడ్ల అభివృద్ధికి ఒకే వ్యవస్థ.. హైదరాబాద్ రోడ్ నెట్‌వర్క్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రోడ్ల అభివృద్ధికి ఒకే వ్యవస్థ.. హైదరాబాద్ రోడ్ నెట్‌వర్క్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 07: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు హైదరాబాద్ నగరం, హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని రహదారి అభివృద్ధి పనులను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్ నెట్‌వర్క్ విస్తరణ, కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, నిధుల సమీకరణ, నిర్వహణతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారుల నిర్వహణను సమన్వయంతో ఒకే వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని సీఎం సూచించారు. ఓఆర్ఆర్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా...
Spread the love