[t4b-ticker]
పేపర్ లీక్‌లకు అడ్డుకట్ట వేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

పేపర్ లీక్‌లకు అడ్డుకట్ట వేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 28: ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు సమగ్ర విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదని, ఆఫ్‌లైన్ విధానంలోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా దేశవ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు భారీగా పెరుగుతున్నాయని, కొన్ని చోట్ల అవే ప్రశ్నాపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యపై రాష్ట్రాలకే...
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి

తెలంగాణకు 11.56 లక్షల ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతి

ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణలో పేదలకు గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇళ్లను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కృషి భవన్‌లో కేంద్ర మంత్రితో సమావేశమైన సీఎం, రాష్ట్రంలోని గ్రామీణ గృహ అవసరాలు, ఉపాధి హామీ పథకం విస్తరణ, రైతుల జీవనోపాధి మెరుగుదలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని సీఎం వివరించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో PMAY-G పథకాన్ని సమర్థంగా వినియోగించకపోవడంతో వేలాది గ్రామీణ...
21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 26, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే జెన్‌జీ (Gen Z) యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణను పార్లమెంట్‌లో తీసుకురావాలని కోరారు. హైదరాబాద్‌లో "యువతే దేశం – దేశమే యువత" పేరుతో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ వంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆత్మహత్యలు,...
డ్రగ్స్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలకూ బాధ్యత.. కఠిన చట్టంపై సీఎం రేవంత్ ఆదేశాలు

డ్రగ్స్‌పై విద్యాసంస్థల యాజమాన్యాలకూ బాధ్యత.. కఠిన చట్టంపై సీఎం రేవంత్ ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 25: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో యాజమాన్యాలకూ బాధ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ప్రాంగణంలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా సంబంధిత యాజమాన్యాలు కూడా జవాబుదారులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం మాట్లాడుతూ, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యాసంస్థల క్యాంపస్‌లతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం...
క్యూర్ పరిధిలో జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

క్యూర్ పరిధిలో జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, జూలై 24, హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ గృహాలు జనావాసాలకు దూరంగా కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల మధ్యలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదలకు ఉపాధి, రవాణా, విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల పోలీసు, రెవెన్యూ, రవాణా తదితర శాఖలకు చెందిన నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అలాంటి భూములను గృహ నిర్మాణానికి వినియోగించి,...
Spread the love