[t4b-ticker]
చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.. చిన్న నీటిపారుదలపై సీఎం రేవంత్‌కు రైతు కమిషన్ కీలక నివేదిక

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.. చిన్న నీటిపారుదలపై సీఎం రేవంత్‌కు రైతు కమిషన్ కీలక నివేదిక

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, చెరువులను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసి చిన్న నీటిపారుదల వనరులను పునరుద్ధరించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి నివేదికను అందించింది. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వనరుల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగాన్ని...
అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు.. ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక లేఖ

అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు.. ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక లేఖ

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులైన వారు ఓటర్ల జాబితాలో చేరకుండా కఠినమైన, పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఓటర్లకు అభ్యంతరాలు, ఫిర్యాదులు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు మరింత సమయం కల్పించడంతో పాటు.. వారికి తగిన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026 జూన్ 10 నాటికి తెలంగాణలో...
తుమ్మిడిహట్టి బ్యారేజీపై కదలిక.. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక భేటీ

తుమ్మిడిహట్టి బ్యారేజీపై కదలిక.. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక భేటీ

ప్రతిపక్షం, ఆగస్టు 27: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నిరంతరంగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో జరుపుతున్న సంప్రదింపుల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న న్యూఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి ముందుకు వెళ్లే మార్గాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును తిరిగి కార్యరూపంలోకి తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల మధ్య...
మీరాలం ట్యాంక్‌ను అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

మీరాలం ట్యాంక్‌ను అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 27: హైదరాబాద్‌లోని మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఒక్కో పనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా అత్యుత్తమ రూపకల్పనతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మీరాలం ట్యాంక్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, ఇప్పటివరకు చేపట్టిన పనులు, భవిష్యత్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం...
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరగక ఆందోళన చెందుతున్న తెలంగాణ వాసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. బాధితుల...
Spread the love