[t4b-ticker]
ప్రజాపాలన 1000 రోజులు.. సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మహేశ్‌కుమార్ గౌడ్

ప్రజాపాలన 1000 రోజులు.. సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మహేశ్‌కుమార్ గౌడ్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలు, యువత, బలహీనవర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి సుమారు 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు...
వెయ్యి రోజులు పూర్తి.. కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పేంటి?

వెయ్యి రోజులు పూర్తి.. కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పేంటి?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 1000 రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజా ప్రభుత్వం పేరుతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్.. తమ పాలనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెబుతుండగా, ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తోంది. రైతుల కోసం రైతు భరోసా, రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపట్టామని ప్రభుత్వం...
మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖపై చర్యల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే నివేదిక సిద్ధమైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో జరిపే భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు,...
బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 31: నిజామాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయ వేడిని పెంచింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే తాను కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. ‘‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి’’ అని ఆమె నినదించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్దేశం ప్రజలు తమను తాము పాలించుకోవడం, తమ జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని కవిత అన్నారు. రాష్ట్ర సాధన కోసం...
మెస్సీకి రేవంత్ రెడ్డి అభినందనలు.. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయే

మెస్సీకి రేవంత్ రెడ్డి అభినందనలు.. ఫుట్‌బాల్ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయే

ప్రతిపక్షం, ఆగస్టు 31: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ను దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మెస్సీ ప్రయాణం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మెస్సీని కలుసుకుని ఆయనతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో కొన్ని నిమిషాలు గడిపే అవకాశం లభించడం తనకు ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. 2005లో హంగేరీతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ ద్వారా అర్జెంటీనా జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన మెస్సీ.. అప్పటి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనకంటూ ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్నారు. అసాధారణ ప్రతిభకు నిరంతర శ్రమ, అచంచలమైన పట్టుదలను జోడించి...
Spread the love