[t4b-ticker]
అమెరికా పర్యటన రద్దు.. యూకేలోనే కొనసాగనున్న సీఎం రేవంత్ పర్యటన

అమెరికా పర్యటన రద్దు.. యూకేలోనే కొనసాగనున్న సీఎం రేవంత్ పర్యటన

ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చేపట్టిన అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తొలుత యూకే, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోరగా.. యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి, విస్మయం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం...
22-ఏ భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు ఉండవు

22-ఏ భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు ఉండవు

ప్రతిపక్షం, ఆగస్టు 19, హైదరాబాద్: 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటు భూముల యజమానులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు వాటిని త్వరగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంబంధిత భూమి ప్రైవేటు ఆస్తి అని నిర్ధారణ...
సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీత, చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీత, చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 18, హైదరాబాద్: రాష్ట్రంలోని గీత, చేనేత కార్మికులకు సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గీత కార్మికుల సంక్షేమం, బహుజనుల అభివృద్ధి, విద్య, సామాజిక న్యాయం తదితర అంశాలపై సీఎం మాట్లాడారు. అర్హులైన గీత, చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నా వారికి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గీత కార్మికుల సంప్రదాయ వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గౌడ సోదరుల భద్రత కోసం...
పేదలకు ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకం తెస్తాం: కవిత

పేదలకు ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకం తెస్తాం: కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 18, హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కవిత అన్నారు. సామాజిక న్యాయంపై తమ పార్టీ నిర్వహించిన సంకల్ప సభ తర్వాతే ప్రభుత్వం ఆ అంశంపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మాటల్లో సామాజిక న్యాయం చెబుతూ.....
ఏడాదిన్నరలో మరో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి

ఏడాదిన్నరలో మరో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 18: హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, అల్వాల్ టిమ్స్, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి చొప్పున నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సనత్‌నగర్‌లో ప్రారంభించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌లో గుండె, మూత్రపిండాలు, అవయవ మార్పిడి చికిత్సలకు...
Spread the love