రైతులకు శుభవార్త.. ఈ నెల 30న ‘రైతు భరోసా’ నిధుల విడుదల – సన్న ధాన్యానికి బోనస్

రైతులకు శుభవార్త.. ఈ నెల 30న ‘రైతు భరోసా’ నిధుల విడుదల – సన్న ధాన్యానికి బోనస్

ప్రతిపక్షం, జూన్ 18: వానాకాలం సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరా, మెట్రో విస్తరణ, జాతీయ అర్హత పరీక్ష నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో భారీ రైతు సమ్మేళనం నిర్వహించి, అదే వేదికపై రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ఏడు రకాల సన్న ధాన్యాలకు...
ప్రభుత్వ విద్యలో కొత్త ప్రమాణాలు.. ఆరుట్ల పాఠశాల రాష్ట్రానికి ఆదర్శం: సీఎం రేవంత్

ప్రభుత్వ విద్యలో కొత్త ప్రమాణాలు.. ఆరుట్ల పాఠశాల రాష్ట్రానికి ఆదర్శం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోలేరనే అపోహలను తొలగించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యమని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఉన్నతాధికారులుగా ఎదగగలరనే విశ్వాసాన్ని సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యను భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామని, రాష్ట్ర బడ్జెట్‌లో భారీ మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తున్నామని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో అసమానతలు,...
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. ప్రభుత్వ విద్యలో కొత్త అధ్యాయానికి శ్రీకారం

ప్రతిపక్షం, జూన్ 17: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని కూడా ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలోని డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, రవాణా సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సరదాగా గడిపారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేలా ఈ...
రైతులకు సమగ్ర ప్రణాళిక.. సన్న వడ్లకు ప్రోత్సాహం: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రైతులకు సమగ్ర ప్రణాళిక.. సన్న వడ్లకు ప్రోత్సాహం: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 17: రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటల నమోదు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ శాఖకు పూర్తి సమాచారం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ, రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రతి దశను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లో...
99 రోజుల ప్రజాపాలనతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది: సీఎం రేవంత్ రెడ్డి

99 రోజుల ప్రజాపాలనతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 16: మార్చి 16 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన 99 రోజుల కార్యాచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలను పరిశీలించిన సీఎం, చురుకుగా పనిచేసిన శాఖలను అభినందించారు. క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించని అధికారులు, జిల్లా కలెక్టర్ల వివరాలను సమర్పించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను నమోదు చేసి పరిష్కరించాలని సూచించిన సీఎం, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను...
ePaper
Spread the love