Trending Now

కౌంటింగ్​ ఏర్పాట్లలో అధికారులు విఫలం… పోలీసుల అత్యుత్సాహం

ప్రతిపక్షం, హైదరాబాద్​:

జూబ్లిహిల్స్​ ఉప ఎన్నికల ఓట్ల లెక్కిపు ప్రక్రియ యూసఫ్​ గూడ అంబేద్కర్​ ఇండోర్​ స్టేడియంలో జరుగుతోంది. అయితే ఎన్నికల అధికారులు చేసిన ఏర్పాట్లలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కౌంటింగ్​ హాల్​లో పరిస్థితులు ఇరుకుగా ఉన్నాయని ఏజెంట్లు చెబుతున్నారు. టేబుల్​ టేబుల్​ కి కూడా సరైన గ్యాప్​ లేకుండా ఇరుకైన ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కౌంటింగ్​ హాల్​ బయట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఎన్నికల కమిషన్​ పాసులు జారీ చేసిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు కౌంటింగ్​ హాల్​లోకి అనుమతించడం లేదు. వెస్ట్​ జోన్​ డీసీపీ ఆదేశాల ప్రకారం మీడియాను లోపలికి అనుమతించేది లేదంటూ పోలీసులుచెబుతున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు కౌంటింగ్​ హాల్​ బయటే ఎదురు చూస్తూ ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కనీసం ఎన్నికల అధికారులు కూడా రౌండ్​ రౌండ్​కు అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అంతా గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్​ పాసులు జారీ చేసినా పోలీసులు అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు ఎన్నికల అధికారులను కూడా డిక్టేట్​ చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.

Spread the love

Related News