ప్రతిపక్షం, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుండి బీజేపీ అభ్యర్థి దీపక్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫలితం ఏదయినా జూబ్లిహిల్స్ ఓటర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఇంకా కష్టపడి పని చేస్తామని అన్నారు.


























