Trending Now

జూబ్లీహిల్స్ ప్రజలు.. ప్రజా పాలన వైపే: మంత్రి పొన్నం

ప్రతిపక్షం, హైదరాబాద్​:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలపై నమ్మకం వల్లే ప్రజలు కాంగ్రెస్​ కు పట్టం కడుతున్నారని ఆయన అన్నారు. ప్రతి రౌండ్​లోనూ ప్రజలు కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి , సంక్షేమం ముందు బీఆర్​ఎస్​ సెంటిమెంట్​ రాజకీయాలు విఫలమయ్యాయన్నారు. బీఆర్​ఎస్​ నేతలు ఓటమి భయంతోనే రిగ్గింగ్​ ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. బీఆర్​ఎస్​, బీజేపీ కుమ్మక్కు అయినా ప్రజలు కాంగ్రెస్​ ప్రజా పాలన వైపే మొగ్గుచూపారని అన్నారు. బీఆర్​ఎస్​ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.

Spread the love

Related News