ప్రతిపక్షం సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 7: ఏబివిపి సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా నారాయణ రావు పేట మండల కేంద్రానికి చెందిన జిల్లెల్ల ఫణిందర్ ఎన్నికయ్యారు. ఖమ్మం లో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఆయన ను సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎబివిపి తెలంగాణ రాష్ట్ర శాఖ కి కృతజ్ఞతలు తెలిపారు.





























