Trending Now

పెద్దపల్లి పార్లమెంట్ ఓటింగ్ సరళిపై మందకృష్ణ సమీక్ష

ప్రతిపక్షం, మంథని, మే 18 : పెద్దపల్లి పార్లమెంట్ ఓటింగ్ సరళిపై శుక్రవారం ఏమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌లోని తన నివాసంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తో సమీక్ష నిర్వహించారు. గోమాస శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి లను తన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకున్న మందకృష్ణ పార్లమెంటు పరిధిలో క్రాస్ ఓటింగ్ జరినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఓటింగ్ సరళిపై వారితో సమీక్షించారు. దేశ స్థాయిలో మోడీ కే పట్టం కట్టాలనే కృత నిశ్చయంతో పెద్ద ఎత్తున యువత, విద్యాధికులు, ఉద్యోగస్తులు బీజేపీ వైపు మొగ్గు చూపారని పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Spread the love

Related News