ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 01: భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో వాస్తవ పరిస్థితులపై ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి శ్రీధర్ బాబు గురువారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

















