‘హరితహారం’ ఇక నుంచి ‘వనమహోత్సవం’..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ పేరు మారింది. ఆ కార్యక్రమాన్ని ‘వనమహోత్సవం’గా మారుస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జులై మొదటి వారం నుంచి 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. టేకు, వేప, కానుగ, సుబాబులు, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను పెంచనున్నారు.

Spread the love

Related News