తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి

ప్రతిపక్షం, జూలై 20: హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో తోటి మహిళా ఐపీఎస్ అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు, ప్రచారంలో ఉన్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. చివరికి నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించే ముందు మీడియా సంస్థలు వాస్తవాలను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News