హైదరాబాద్. ప్రతిపక్షం న్యూస్, సెప్టెంబర్ 12: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో భద్రాచలం పట్టణానికి చెందిన వస్కా సుజ్ఞాన్ శనివారం కాంస్య పతకం సాధించారు. వాకో ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ లో జరిగిన -91కేజీల కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. కాంశ్య పతకం సాధించిన వస్కా సుజ్ఞాన్ భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వస్కా ప్రసాద్ కుమారుడు కావడం గమనార్హం. సుజ్ఞాన్ పతకం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
































