నీట్ పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: ప్రధాని మోదీ

ప్రతిపక్షం, జూలై 23: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని స్పష్టం చేసిన ఆయన, పేపర్ లీకేజీ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన ప్రధాని, ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మోదీ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News