మోదీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్.. ‘యువత భవిష్యత్‌ను దెబ్బతీసింది మీరే’

ప్రతిపక్షం, జూలై 23: ప్రధాని నరేంద్ర మోదీ యువత భవిష్యత్తుకు హాని చేసే వారిని వదిలిపెట్టబోమని చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. దేశ యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం కలిగించింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.

సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, విద్యా వ్యవస్థను దెబ్బతీసే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో నష్టపోయిన విద్యార్థులకు ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.

అలాగే విద్యార్థుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Spread the love

Related News

Latest News