రేపు దేశవ్యాప్త నిరసనకు CJP పిలుపు.. ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల మద్దతు

ప్రతిపక్షం, జూలై 23: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్న CJP రేపు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. “ప్రతి జిల్లా – ఒక రోజు – ఒక డిమాండ్” అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనాలని కోరింది.

ఇటీవల జరిగిన పోలీసు చర్యల్లో ప్రభావితమైన వారికి సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు CJP వెల్లడించింది. నిరసన ప్రదర్శనలు నిర్వహించే ముందు స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించింది.

ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు విద్యార్థి సంఘాలు రేపు పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక పరిస్థితులను గమనించాలని సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News