[t4b-ticker]

భారత్‌ నాకు రెండో ఇల్లు: షేన్‌ వాట్సన్

ప్రతిపక్షం, ఆగస్టు 20: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌ వాట్సన్ భారత్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. భారత్‌ తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొంటూ.. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత క్రికెట్ అభిమానుల నుంచి తనకు మరింత ఆదరణ లభించిందని చెప్పారు. సిడ్నీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన భారత్‌లో తనకు లభించిన ప్రేమాభిమానాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత క్రికెట్ అభిమానులతో తనకు ఎంతో బలమైన అనుబంధం ఏర్పడిందని వాట్సన్ తెలిపారు. స్వదేశంలో తన ఆటపై వచ్చినంతగా భారత్‌లో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదని చెప్పారు. భారత అభిమానులు తనను ఎంతో ఆప్యాయంగా ఆదరించారని, వారి ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.

భారత్‌లోని ఆహారంపైనా వాట్సన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఇక్కడ లభించే శాకాహార భోజనం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. భారత క్రికెట్‌, అభిమానులతో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని తెలిపారు.

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా భారత అభిమానులతో ఆయనకు మరింత సన్నిహిత సంబంధం ఏర్పడింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ, అభిమానుల అభిమానం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని వాట్సన్ పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News