[t4b-ticker]

జైలు రోజులు గుర్తుచేసుకుంటూ కవిత కన్నీళ్లు.. ‘‘పిరికిదాన్ని అనుకోవద్దు’’ అంటూ భావోద్వేగం

ప్రతిపక్షం, ఆగస్టు 31: తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత తన అరెస్టు, జైలు జీవితం గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆమె.. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తిహార్‌ జైలులో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఏ తప్పూ చేయని మీ ఆడబిడ్డనైన నన్ను తిహార్‌ జైలులో పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను వెనక్కి తగ్గలేదు’’ అని కవిత పేర్కొన్నారు. చివరకు న్యాయస్థానం కూడా తాను తప్పు చేయలేదని స్పష్టం చేసిందని అన్నారు.

అయితే తనను పార్టీ నుంచి అన్యాయంగా బయటకు పంపించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, గుండెల్లో ఎంతో వేదనతో ఉన్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆవేదనను బలహీనతగా భావించవద్దని, తాను పిరికిదాన్ని కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం, ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని కవిత అన్నారు. తనకు ఎదురైన కష్టాలు, అవమానాలు తనను మరింత బలంగా నిలబెడతాయని పేర్కొన్నారు. సభలో కవిత భావోద్వేగానికి గురికావడంతో అక్కడున్న కార్యకర్తలు, అభిమానులు కూడా స్పందించారు.

Spread the love

Related News

Latest News