[t4b-ticker]

బహుజన తెలంగాణ సాధనే టీఆర్ఎస్ లక్ష్యం

ప్రతిపక్ష బ్యూరో, నిజామాబాద్ ఆగస్టు 31: బీఆర్ఎస్ బంగారు తెలంగాణాలో నలుగురైదుగురు మాత్రమే బంగారం అయ్యారని కవిత ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ బయలు దేరుతుందని తనను ఆశీర్వదించాలని ఆ పార్టీ చీఫ్ కవిత కోరారు. సోమవారం నిజామాబాద్ లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ తాను సామాజిక తెలంగాణ కావాలి బహుజన తెలంగాణ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసిన అవినీతిపై వారిని వదలబోమని, వెంట పడతామని కవిత హెచ్చరించారు.రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న పాంచజన్య సంకల్ప సభలో ఆమె తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అందరు గమనిస్తున్నారు.కొత్త శక్తి రావాలి కొత్త చరిత్ర లిఖించాలి అన్నారు.

Spread the love

Related News