‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్పథ్లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.
‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్పథ్లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.
Related News
నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలి: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
మేడిగడ్డను కూల్చి.. ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా? భారాస నేతల వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బీహార్ లోని బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యం.. రొబోటిక్ సర్జరీల్లో తెలంగాణ దూసుకుపోతోంది: మంత్రి దామోదర
నిమ్స్లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్రెడ్డి
బాడీ బిల్డర్ ఆత్మహత్య.. భార్య తన శవాన్ని తాకొద్దంటూ..
‘భూ భారతి’లో ప్రైవేటు ఆపరేటర్లకు గుడ్బై
UPI చెల్లింపుల్లో కొత్త రూల్.. బ్యాంకుల ప్రతిపాదన!
కొత్త LPG కనెక్షన్లకు బ్రేక్?.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు
కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది.. మంత్రి పదవులపై ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
వ్యవస్థ మొత్తం బ్రిజ్ను రక్షిస్తోంది: వినేశ్ ఫొగాట్
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలనం.. బంకీపూర్లో జన్ సురాజ్ తొలి చారిత్రక విజయం
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని పోలీసుల సూచన
బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది
కాలుష్యం వెదజళుతున్న MS అగర్వాల్ పరిశ్రమపై చర్య తీసుకోవాలి
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
కాళికాదేవి బోనాల మహోత్సవానికి మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ కు ఆహ్వానం
‘జాబ్ క్యాలెండర్ ఎక్కడ.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?’.. ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్
Latest News
నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలి: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
మేడిగడ్డను కూల్చి.. ఇప్పుడు గోదావరిపై రాజకీయాలా? భారాస నేతల వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బీహార్ లోని బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యం.. రొబోటిక్ సర్జరీల్లో తెలంగాణ దూసుకుపోతోంది: మంత్రి దామోదర
నిమ్స్లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్రెడ్డి
బాడీ బిల్డర్ ఆత్మహత్య.. భార్య తన శవాన్ని తాకొద్దంటూ..
‘భూ భారతి’లో ప్రైవేటు ఆపరేటర్లకు గుడ్బై
UPI చెల్లింపుల్లో కొత్త రూల్.. బ్యాంకుల ప్రతిపాదన!
కొత్త LPG కనెక్షన్లకు బ్రేక్?.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు
కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది.. మంత్రి పదవులపై ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
వ్యవస్థ మొత్తం బ్రిజ్ను రక్షిస్తోంది: వినేశ్ ఫొగాట్
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలనం.. బంకీపూర్లో జన్ సురాజ్ తొలి చారిత్రక విజయం