[t4b-ticker]
బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్‌.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించిన భారత్‌.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలన్నీ కలిసి ఢిల్లీ ప్రకటనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఉద్రిక్తతలు, రాజకీయ సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలో బ్రిక్స్ దేశాలన్నీ ఒకే ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదాలకు యుద్ధమే పరిష్కారం కాదని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని బ్రిక్స్ దేశాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ఈ శిఖరాగ్ర సమావేశం అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ప్రతిపాదించిన పది కీలక అంశాలకు సభ్య దేశాల నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఢిల్లీ ప్రకటనను ప్రవేశపెట్టిన సమయంలో ఎలాంటి...
గణేశ్‌ ఉత్సవాలపై ప్రత్యేక నిఘా.. ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గణేశ్‌ ఉత్సవాలపై ప్రత్యేక నిఘా.. ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు మున్సిపల్‌, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రతి విభాగం మధ్య సమన్వయం ఉండేలా ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్‌ మహానగరంలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్‌ ఉత్సవ...
ముఖ్యమంత్రి అవినీతిపై ఆధారాలు బయటపెడతాం.. ఈ నెల 20న కొడంగల్‌లో సభ: కల్వకుంట్ల కవిత

ముఖ్యమంత్రి అవినీతిపై ఆధారాలు బయటపెడతాం.. ఈ నెల 20న కొడంగల్‌లో సభ: కల్వకుంట్ల కవిత

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి తనను తాను గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సభ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితులు మాజీ పార్లమెంటేరియన్‌గా, మాజీ ఎమ్మెల్సీగా తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి కొద్దిసేపు పనిచేసినా లక్షలాది మంది ప్రజల సమస్యలను పరిష్కరించగలిగిన సందర్భాలు దేశ చరిత్రలో అనేకం ఉన్నాయని కవిత అన్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు భారత రాష్ట్ర సమితి పరస్పరం విమర్శలు...
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం.. పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణకు తావులేదు: సీఎం రేవంత్‌రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం.. పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణకు తావులేదు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: తెలంగాణ విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో తీసుకొస్తున్న మార్పులు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఎందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందో వివరించారు. విద్య ఒక్కటే వ్యక్తి జీవితంలో వెలుగును తీసుకురాగలదన్న నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణాల్లో...
బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు వేళాయె.. నేడు కీలక భేటీలు

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు వేళాయె.. నేడు కీలక భేటీలు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేడు ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు. సదస్సులో భాగంగా రోజంతా పలు ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలు జరగనున్నాయి. భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల నేతలు పాల్గొననున్నారు. సదస్సు షెడ్యూల్‌లో భాగంగా మధ్యాహ్నం 2.35 గంటలకు సభ్య దేశాల అధినేతల మధ్య ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ భేటీ మూసివేసిన గదిలో నిర్వహించనున్నారు. ఇందులో బ్రిక్స్‌ దేశాల మధ్య పరస్పర సహకారం, ప్రపంచ పరిణామాలు, ఆర్థిక అంశాలు తదితర కీలక విషయాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 4.25 గంటలకు ‘భారత్‌ ఇన్నోవేట్స్‌’...
Spread the love