ప్రతిపక్షం, జూలై 21: యువత పట్ల మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. నిన్నటి ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
యువతపై ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడటం సరికాదని రాహుల్ గాంధీ అన్నారు. యువతకు ప్రధాని మోదీ ఎందుకు క్షమాపణ చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.



















