విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కేజ్రీవాల్

ప్రతిపక్షం, జూలై 21: ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న సీజేపీ నేతలను కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన కేజ్రీవాల్, విద్యార్థులు ఎదుర్కొంటున్న బాధను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, అయినప్పటికీ వారు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ప్రజల గొంతును అణచివేయాలని ప్రయత్నించే ఏ ప్రభుత్వం అయినా చివరికి ప్రజల అభిప్రాయానికి తలవంచాల్సి వస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News