14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
ప్రతిపక్షం, ఆగస్టు 23, హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బలోపేతం కోసం 14 దేశాల్లో పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈమేరకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 దేశాలతో పాటు పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించారు. ఆయా దేశాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వారి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
వివిధ దేశాలకు నియమించిన అధ్యక్షుల వివరాలు
- ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి
- యూకే: సుమన్ రావు బాల్మూరి
- కెనడా: వెంకట్రామణ్ మెట్ పల్లి
- ఇటలీ: తానింకి కిషోర్ యాదవ్
- మాల్టా: పింటూ ఘోష్
- పోర్చుగల్: ప్రకాష్ పొన్నకంటి
- యూఏఈ: శేఖర్ గౌడ్ ఆరె
- కువైట్: మార్క ప్రమోద్ గౌడ్
- జింబాబ్వే: బెమ్మడి మహేందర్ రెడ్డి
- ఖతార్: శేఖర్ చిలువూరి
- ఫిన్లాండ్: సందీప్ రెడ్డి ఇరెడ్డి
- నార్వే: ప్రసాద్ రావు బిక్కినేని
- సౌదీ అరేబియా: మొజ్జం అలీ ఇఫ్తేకర్
- ఐర్లాండ్: జయంత్ రెడ్డి మెట్టు
టీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ ను నియమించారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.





























