ప్రతిపక్షం, ఆగస్టు 31: ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆ దేశం భారతీయులకు కీలక ఆఫర్ ప్రకటించింది. భారత పౌరులకు నెల రోజుల పాటు వీసా లేకుండా ఉజ్బెకిస్థాన్లో ప్రవేశించే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉజ్బెకిస్థాన్ పేర్కొంది.
ఈ నిర్ణయంతో భారతీయ పర్యాటకుల రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార అవసరాల కోసం ఉజ్బెకిస్థాన్కు వెళ్లే భారతీయులకు కూడా ఈ సౌకర్యం ప్రయోజనం కలిగించనుంది. పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది తొలిసారిగా 100 కోట్ల అమెరికా డాలర్ల స్థాయిని దాటింది. 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని 500 కోట్ల అమెరికా డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీసా రహిత ప్రవేశం వంటి నిర్ణయాలు ప్రజల మధ్య సంబంధాలతో పాటు వ్యాపార, పర్యాటక రంగాల అభివృద్ధికి మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.





























