[t4b-ticker]

నేపాల్‌ వరదల్లో ఏపీ ఎన్నారై కుటుంబం గల్లంతు.. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి విషాదం

ప్రతిపక్షం, ఆగస్టు 28: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారై కుటుంబం గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మన్యం జిల్లా పాండా వీధికి చెందిన సుభాష్‌ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్‌ కుటుంబంతో కలిసి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సుభాష్‌ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్‌ (47) సుమారు 20 ఏళ్ల క్రితం లండన్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య సురభి (43), కుమారుడు స్పందన్‌ (18), కుమార్తె సైనా (13) ఉన్నారు. కుటుంబంతో కలిసి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన సంతోష్‌.. నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

యాత్రలో భాగంగా వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా ఉధృతంగా వచ్చిన వరదలో గల్లంతైనట్లు సమాచారం. వాహనంలో ఉన్న సంతోష్‌, ఆయన భార్య, ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారి పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది.

సంతోష్‌ కుటుంబం గల్లంతైన విషయం తెలియడంతో మన్యం జిల్లాలోని ఆయన తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని వారు ప్రార్థిస్తున్నారు. మరోవైపు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

లండన్‌లో స్థిరపడిన సంతోష్‌ కుటుంబం మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి ఇలా గల్లంతవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Spread the love

Related News

Latest News