ప్రతిపక్షం, జూలై 25: నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఉద్యమిస్తున్న CJP భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటుందని ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చేసిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వేణుస్వామి మాట్లాడుతూ, బుధాదిత్య యోగం ప్రభావంతో అక్టోబర్ 31 వరకు CJPకి విశేష ప్రజాదరణ లభిస్తుందని అన్నారు. జాతకరీత్యా ప్రధాని నరేంద్ర మోదీతో అననుకూల గ్రహస్థితులు ఉన్నందున ఈ పరిణామాల ప్రభావం ఎక్కువగా బీజేపీపైనే పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అలాగే, CJP ఉద్యమాన్ని అణచివేయడానికి చేసే ప్రయత్నాలు ప్రభుత్వానికే ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడవచ్చని కూడా ఆయన జోస్యం చెప్పారు.
ఇంకా, CJPకి చెందిన ముగ్గురు నేతలు జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అనంతరం అదే సంస్థ ప్రభుత్వాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతుందని వేణుస్వామి తన విశ్లేషణలో పేర్కొన్నారు.

















