తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 21: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Spread the love

Related News

Latest News