ప్రతిపక్షం, జూలై 21: యువత ఆకాంక్షలు నెరవేరకపోతే దేశంలో జెన్జీ నిరసనలు తప్పవని పది నెలల క్రితమే తాను హెచ్చరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీలో తాజాగా జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని సూచించారు. యువత డిమాండ్ చేస్తున్న జవాబుదారీతనం, విద్యారంగ సంస్కరణలపై కేంద్రం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

















