ఐపీఎల్-2027 సీజన్.. కాస్త ముందుగానే!

ప్రతిపక్షం, జూన్ 18: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్-2027 సీజన్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి యోచిస్తోంది. టోర్నీని మార్చి 10 నుంచి మే 15 మధ్య నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలితో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అవకాశం లేదని, గత సీజన్‌ల మాదిరిగానే 74 మ్యాచ్‌లతోనే టోర్నీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం కోసం క్రీడా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Spread the love

Related News

Latest News