ప్రతిపక్షం, జూలై 21: తెలంగాణలో ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును 2027 నాటికి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై శాస్త్రీయ పరిశీలన పూర్తయిందని, పునరుద్ధరణకు అనుగుణంగా డిజైన్లను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.

















