ప్రతిపక్షం, జూలై 21: వరుస గాయాలు, ఓటములతో కెరీర్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచారని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి అవసరమైన సమయంలో కోహ్లీని కలిశానని చెప్పారు. తమ మధ్య జరిగిన సంభాషణను బయటకు వెల్లడించలేనని, అయితే కోహ్లీ తనకు ఎంతో మేలు చేశారని, అందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని సింధు పేర్కొన్నారు.


















