SIRకు మరో వారమే గడువు.. ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఈసీ సూచన

ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision-SIR)లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు మరో వారం రోజుల మాత్రమే గడువు మిగిలి ఉంది. ఓటర్లందరూ తమ ఎన్యూమరేషన్ ఫారమ్ (EF)ను ఆగస్టు 3లోగా తప్పనిసరిగా సమర్పించాలని భారత ఎన్నికల సంఘం సూచించింది.

ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)కు నేరుగా అందజేయవచ్చు. గడువు ముగిసేలోపు ఫారమ్ సమర్పించని వారు ఓటరు జాబితాలో తమ పేరును కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ వంద శాతం పూర్తైంది. ఇప్పటివరకు అందిన ఫారమ్‌లలో 75.13 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఓటు హక్కును కొనసాగించుకోవాలంటే ప్రతి అర్హత కలిగిన ఓటరు గడువు ముగిసేలోపు ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం మరోసారి విజ్ఞప్తి చేసింది.

Spread the love

Related News

Latest News