అరుణాచలం యాత్రలో వనపర్తి బృందానికి ఘోర ప్రమాదం

  • ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం
  • మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ బృందం ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం

ప్రతిపక్షం, జూలై 20, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మిత్రులతో కలిసి అరుణాచలం యాత్రకు వెళ్లిన సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అరుణాచలం సమీపంలోని తిరుచి వైపు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం అందింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల నుంచి పూర్తి సమాచారం వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News