Trending Now

రాజస్థాన్​ లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్​ విమానం

పైలెట్​ మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

రతన్​ గఢ్​, జూలై 9: రాజస్థాన్​ చురూ జిల్లా రతన్​ గఢ్​ సమీపంలో భానుదా గ్రామం వద్ద భారత వైమానిక దళానికి చెందిన విమానం బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్​ మృతిచెందినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గతంలో రాజస్థాన్​ లోని జైసల్మేర్​ వద్ద 2024 మార్చి 12న భారత వాయుసేనకు సంబంధించిన తేజస్​ ఎయిర్ క్రాఫ్ట్​ కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్​ ప్రాణాలతో బయటపడ్డారు.

అదే విధంగా 2021 డిసెంబర్​ 24న ఇదే జైసల్మేర్​ కు సమీపంలో వాయు సేనకు సంబంధించిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్​ కమాండర్​ హర్షిత్​ సిన్హా మరణించారు.

Spread the love

Related News