Trending Now

వైసీపీకి బిగ్ షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్‌కు పంపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనకు కానీ తనక భర్తకు కానీ పోటీ చేసే అవకాశం కల్పించాలన్న అభ్యర్థనను వైసీపీ మన్నించలేదనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పని చేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్లల ఒకరుగా పేరొందని ఆమె రాజమండ్రి, నందిగామ, జగ్గయ్యపేటల్లో.. ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలనుకున్నారట. కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

Spread the love

Related News