ప్రతిపక్షం, ఆగస్టు 25: విద్యాసంస్థలు నిర్ణయించిన యూనిఫామ్, డ్రెస్ కోడ్ను విద్యార్థులు తమ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవడానికి హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. యూనిఫామ్తో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఇస్లామిక్ ఆచారాల్లో హిజాబ్ తప్పనిసరి అని పేర్కొంటూ చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. విద్యాసంస్థలు విద్యార్థులందరికీ ఒకే విధమైన డ్రెస్ కోడ్ను అమలు చేయవచ్చని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలకు తమ సంస్థలో యూనిఫామ్, దుస్తుల నిబంధనలను నిర్ణయించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, సమానత్వం, ఒకే విధమైన గుర్తింపు కోసం యూనిఫామ్ నిబంధనలు అమలు చేస్తారని కోర్టు పేర్కొంది. వ్యక్తిగత మతపరమైన ఆచారాలను అనుసరించే హక్కు ఉన్నప్పటికీ, సంస్థ నిర్దేశించిన డ్రెస్ కోడ్ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేయలేరని తీర్పు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు రూపొందించిన దుస్తుల నిబంధనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కోర్టు పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిజాబ్ ధరించడాన్ని అనుమతించాలన్న విద్యార్థిని అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.





























