Trending Now

BREAKING: బీజేపీ నాలుగో జాబితా విడుదల..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల కాగా.. తమిళనాడు నుంచి 14 మంది అభ్యర్థులు, పుదుచ్చేరి నుంచి ఒకరు ఉన్నారు. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు.. ఊహించని వ్యక్తులకు కూడా టిక్కెట్ దక్కింది. సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమో ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు.

Spread the love