Trending Now

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌తో పాటు.. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించింది.

Spread the love