ప్రతిపక్షం, జూలై 21: ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న సోనమ్ వాంగ్చుక్, విద్యార్థులకు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మద్దతు తెలిపారు. దేశ భవిష్యత్తు, యువత కోసం వారు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సోనమ్ వాంగ్చుక్, విద్యార్థులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన నిరసన దీక్షను విరమించాలని ప్రీతీ జింటా విజ్ఞప్తి చేశారు. నిరసనకారులకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ వారికి తన మద్దతు ప్రకటించారు.



















