Trending Now

జీహెచ్​ఎంసీలో దొంగలు పడ్డారు.. అక్రమార్కులపై చర్యలు నిల్​

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ మహానగర పాలక సంస్థలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. దొంగలేంటిరా బాబూ.. అనుకుంటున్నారా? అవును నిజమే బల్ధియాలో నిధులను, ఆస్తులను ఈ దొంగలు దోచుకుంటూనే ఉన్నారు. దొంగలు దొరుకుతున్నా ఇటు బల్ధియా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్​గా చర్యలు తీసుకోకపోవడంతో దొంగలు యధేచ్చగా దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. గత పదేళ్ల నుంచి బల్ధియాకు నగర ప్రజలు కడుతున్న పన్నులను కొంత మంది జేబుతు నింపుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా పారిశుద్ద్యంతో పాటు ఫాగింగ్​లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతూనే ఉంది. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో కార్మికులు లేకున్నా పనిచేస్తున్నట్లు చెబుతూ బల్ధియా కు కన్నెవ వేశారు. నకిలీ ఫింగర్​ఫ్రింట్స్​తో లూటీ చేశారు. తాజాగా మరో స్కాం వెలుగులోకి వచ్చింది. అదేంటీ అంటే బర్త్​ అండ్​ డెట్​ సర్టిఫికెట్స్​ జారీలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడి దృవపత్రాలు జారీ చేసేశారు.

ఫలక్​నుమా సర్కిల్​లో నాన్ అవెలబులిటి సమాచారం రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్‌లోనూ దందా జోరుగా సాగింది. 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవెలబూలిటి కింద సర్టిఫికెట్ జారీ అయ్యింది. ఈ సర్టిఫికెట్లను ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు వాడుతున్నట్లు బయటపడింది. గత కమిషనర్ లోకేష్ కుమార్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి.

ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సమస్యను బట్టి డబ్బులు వసూలు చేయడం జరుగుతోంది. ఒక్కో సర్కిల్ నుండి రూ. 3 లక్షలు, ఆదాయం ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షలు నెలసరి ఆదాయం వసూలు అవుతున్న పరిస్థితి. సర్కిల్‌లో ఏఎంఓహెచ్ లేని చోట డిప్యూటీ ఈఈలను అధికారులు నియమించారు. అయితే ఇలాంటి ప్రదేశాల్లో ఏఎంసీ/ రిజిస్ట్రార్‌లు బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్స్ జారీ అయ్యాయి. సీఎంఓహెచ్‌పై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగులు సీఎమ్‌ఓహెచ్ తమను వేధిస్తున్నారని మేయర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. మొన్ననే నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో 84 లక్షల రూపాయలను కాజేసిన కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బయటపడ్డ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల స్కాంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Spread the love