Trending Now

BIG BREAKING: వైఎస్ షర్మిల అరెస్ట్.. ఉండవల్లిలో ఉద్రిక్తత..

ప్రతిపక్షం, ఏపీ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం సందర్భంగా.. షర్మిల గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి సెక్రేటరియట్ ముట్టడికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను కొండవీటి ఎత్తిపోతల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.

Spread the love

Latest News