Trending Now

బీజేపీకి బిగ్ షాక్.. ఎంపీపై కేసు నమోదు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్ట్ చేశారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తెలిపారు. ఆయన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శతృత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 19న ఎక్స్‌తో పాటు యూట్యూబ్‌లలో ఇటువంటి పోస్టులు చేసినట్టు తెలుస్తోంది.

Spread the love