Trending Now

పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి..

కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితేష్ కుమార్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల డిప్యూటి కమిషనర్ నితేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి తెలంగాణ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల వారిగా ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై సమీక్షించారు. ఈవీఎం ల ర్యాండమైజేషన్, ఓటరు గుర్తింపు పత్రాల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పన, వెబ్ కాస్టింగ్, సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు తదితర అంశాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతీ రెండు గంటలకు తప్పకుండా ఖచ్చితమైన పోలింగ్ శాతపు వివరాలు పంపాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయాలన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల సిబ్బందికి రెండో విడత అవగాహనా, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పోలీసు శాఖ వారి సమన్వయంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ జానకి షర్మిళ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నర్వహణకు పటిష్ఠ బద్రతను కల్పిస్తున్నామని అన్నారు. 48 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, అదనపు పోలీస్ బద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డీఆర్వో భుజంగ్ రావ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News