Trending Now

మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి రిమాండ్..

ప్రతిపక్షం, ఏపీ: జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు విజయవాడలోని ఒకటవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జిం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. శరత్ ను అక్కడి జిల్లా జైలుకు తరలించారు. పై ఆరోఫణలతో పోలీసులు శరత్ ను గురువారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. శరత్ సహా ఏడుగురిపై కేసు నమోదయింది. వారిలో ఆయన భార్య, బావమరిది కూడా ఉన్నట్టు సమాచారం కాగా తన కుమారుడు ఆ కంపెనీ(అవెక్సా)కి కేవలం మూడు నెలలే అదనపు డైరెక్టర్‌గా పనిచేశారని, అతని అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని పుల్లారావుతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

Spread the love

Latest News