Trending Now

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఘోర ప్ర‌మాదం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది మృత్యువాత ప‌డ్డారు. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగుల‌ను తీసుకెళ్తున్న బ‌స్సు మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌మాద‌వ‌శాత్తు మట్టి గ‌ని వ‌ద్ద మొరం కోసం త‌వ్విన గొయ్యిలో ప‌డిపోయింది.

ఈ దుర్ఘ‌ట‌న‌లో 12 మంది అక్క‌డిక‌క్క‌డే చనిపోయారు. మ‌రో 12 మందికి పైగా గాయప‌డ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Spread the love

Related News