Trending Now

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై రాష్ట్రపతికి నివేదిక..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఒకే దేశం- ఒకే ఎన్నికపై ప్రతిపాదనపై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవాళ ఉదయం అందజేశారు. ఎనిమిది విభాగాల్లో సుమారు 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి గత ఏడాది సెప్టెంబర్ లో కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కాగా, 2029 లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.

Spread the love