ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రేవంత్ అన్న ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారిని ఇందిరా శోభన్ అన్నారు. రేవంతన్న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రారంభించి విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆర్థిక పరిపుష్టితో ఎదగాలన్న ఇందిరాగాంధీ లక్ష్యం రేవంతన్న ప్రజాపాలనలో నెరవేరుస్తున్నారు. ఇంట్లో మహిళ ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందన్నారు.
KCR ప్రభుత్వంలో మహిళలను ఎంతో చిన్న చూపు చూసింది, మహిళలను అగౌరపరిచారని.. మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు. మహిళా మంత్రి లేకుండానే పాలన కొనసాగించారని బీఆర్ఎస్ పై ఆమే మండిపడ్డారు. ప్రజా పాలనలో రేవంతన్న నాయకత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. మహిళలకు సమానత్వం సమన్యాయం, సమృద్ధి వైపు రేవంతన్న ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.