Trending Now

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 10 : శాంతి భద్రతలను విఘాతం కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. స్వామి గంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మే 13వ జరగనున్న పోలింగ్ సందర్బంగా ఈవీఎంల తరలింపు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం నందు ఇట్టి సమావేశాన్ని నిర్వహించారు.ముఖ్యంగా రూట్ మొబైల్స్ ఇంచార్జి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోలింగ్ విధుల పట్ల అధికారులకు, సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మన వంతు కృషి చేయాలని తెలియజేశారు. రౌడీ షీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సూర్యనారాయణ, నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, సీఐలు, ఎస్సైలతో పాటు రూట్ మొబైల్స్ ఇంచార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News