Trending Now

నేడు టీడీపీ-జనసేన-బీజేపీ కీలక సమావేశం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నాయి. పొత్తును ప్రకటించిన అనంతరం ఈ మూడు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరితో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న కేంద్ర బృందంతో పవన్, పురందీశ్వరి వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరిపారు.

Spread the love