Trending Now

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణలోని ఐఆర్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు 5 శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించగా.. అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎన్నికల కోడ్ రావడం.. కొత్త సర్కారు కొలువు దీరడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయిస్ కలిశారు. పీఆర్సీ, ఐఆర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం వెంటనే స్పందించి ఆర్థిక శాఖకు నోట్ పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తాజాగా ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ సంస్థల స్పెషల్ సెక్రటరీ లేఖ రాశారు.

Spread the love

Related News

Latest News