ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని బస్తర్ ఏరియా ఐజీ సురేందర్రాజ్ స్పష్టం చేశారు. బీజాపూర్నేషనల్ పార్క్ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోగా ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారని ఐజీ తెలిపారు. ఆదివారం ఉదయం నుండి బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల కోసం ఇంకా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.